OM NAMA SIVAAYA --82

ఓం నమః శివాయ-53 ****************** వైభవమను పేరజరుగు ప్రలోభములు నీ సేవలు నెత్తిన పోసిన నీటిని నాదని గంగ తాగేస్తోంది భక్తితో పోసిన పాలను పాములు కానిచ్చేస్తున్నవి చక్కెర-తేనెల తీపిని చీమలు పట్టేస్తున్నవి చందన ధారలు మొత్తము జాబిలి దాచేస్తున్నది జర్రున జారిన నేతిని విషము జుర్రుకుంటున్నది కురిసిన పూలకుప్పలను భ్రమరము కప్పేస్తున్నది రాలిన బూడిదరాశులకై లొల్లి వల్లకాడు చేస్తున్నది ఆరురుచుల ఆరగింపు నంది తనది అంటున్నది దొంగతనము నేర్పించిన దొంగలదొర,నీ సన్నిధి నిమిషములో నామనసు దొంగగ మారుతున్నది చక్కదము ఇదేనురా ఓ తిక్కశంకరా. శివునికి అభిషేకము చేయు ద్రవ్యములను గంగ,పాములు,జాబిలి,చీమలు,విషము,తుమ్మెదలు,శ్మశానము,నంది అవి శివుని అర్పణము అని తెలిసినను పెద్దలోభమునకు వశులై తాము తీసుకుంటూ,స్వామి స్వామికి అందకుండ చేస్తున్నది.ఒక విధముగా ఇది చోరత్వమే.వాటి చోర స్వభావమునకు కారణము అవితస్కరపతి దగ్గర ఉండటమే.అంతేకాదు,శివుడు తనను సమీపించిన భక్తుని మనసులో కూడ చోరత్వమును ప్రవేశపెడుతున్నాడు.--...