CHIDAANAMDAROOPAA-ADIPATTA NAAYANAARU

చిదానందరూపా-ఆదిపత్త బెస్త నాయనారు-9 ఆదిపత్త బెస్త నాయనారు పరమ భక్తి వాత్సల్యముతో మడుగులో చేపలు పట్టిన వెంటనే,తన మనసు మెచ్చినవాడని ప్రతిదినమును వ్రతముగ ఒక మత్స్యమును సమర్పించెడివాడు ఏమాయెనొ ఏమో మడుగున చేపలన్నియు వీనిని మాయదారి జాలరివాడు మనలను కాపాడుకొందమనుచు మడుగువీడి పోవగా,రోజుకొక మత్స్యము మాత్రమే వలలో పడుచుండెను,వాని పూజకు రివాజును పోనీయక భగ్గున కాముని కాల్చినవాడు,బెస్త భక్కిని నిగ్గును తేల్చగ పసిడి చేపను వలలో వేసెను నాయనారు ధర్మానురక్తిని దీవించగ తాత్సారముచేయక పరవశంబున పసిడిచేపను పరమేశ్వరార్పణమును చేయగ విస్తారపు కరుణను పొందగ బెస్తకు కనకపు చేపయే కారణమాయెనట చిత్రముగాక ఏమిటిది చిదానందుని లీలలు గాక చిత్తముచేయు "శివోహం" జపంబు నా చింతలు తీర్చుగాక. "పత్రం-పుష్పం-ఫలం-తోయం' వీనిలో దేనినైనా భక్తితో సమర్పిస్తే,పరమేశ్వరుడు ప్రీతితో స్వీకరించి అనుగ్రహిస్తాడని పెద్దలు చెబుతారు.జలచరములైన జలపుష్పములను నిష్ఠగ సమర్పించి శివసాయుజ్యమును పొందిన బెస్త ఆదిపత్త నాయనారు."మత్స్య-కూర్మ-వరాహస్య-న...