CHIDAANAMDAROOPAA-ADIPATTA NAAYANAARU
చిదానందరూపా-ఆదిపత్త బెస్త నాయనారు-9
ఆదిపత్త బెస్త నాయనారు పరమ భక్తి వాత్సల్యముతో
మడుగులో చేపలు పట్టిన వెంటనే,తన మనసు మెచ్చినవాడని
ప్రతిదినమును వ్రతముగ ఒక మత్స్యమును సమర్పించెడివాడు
ఏమాయెనొ ఏమో మడుగున చేపలన్నియు వీనిని మాయదారి జాలరివాడు
మనలను కాపాడుకొందమనుచు మడుగువీడి పోవగా,రోజుకొక
మత్స్యము మాత్రమే వలలో పడుచుండెను,వాని పూజకు రివాజును పోనీయక
భగ్గున కాముని కాల్చినవాడు,బెస్త భక్కిని నిగ్గును తేల్చగ
పసిడి చేపను వలలో వేసెను నాయనారు ధర్మానురక్తిని దీవించగ
తాత్సారముచేయక పరవశంబున పసిడిచేపను పరమేశ్వరార్పణమును చేయగ
విస్తారపు కరుణను పొందగ బెస్తకు కనకపు చేపయే కారణమాయెనట
చిత్రముగాక ఏమిటిది చిదానందుని లీలలు గాక
చిత్తముచేయు "శివోహం" జపంబు నా చింతలు తీర్చుగాక.
ఆదిపత్త బెస్త నాయనారు పరమ భక్తి వాత్సల్యముతో
మడుగులో చేపలు పట్టిన వెంటనే,తన మనసు మెచ్చినవాడని
ప్రతిదినమును వ్రతముగ ఒక మత్స్యమును సమర్పించెడివాడు
ఏమాయెనొ ఏమో మడుగున చేపలన్నియు వీనిని మాయదారి జాలరివాడు
మనలను కాపాడుకొందమనుచు మడుగువీడి పోవగా,రోజుకొక
మత్స్యము మాత్రమే వలలో పడుచుండెను,వాని పూజకు రివాజును పోనీయక
భగ్గున కాముని కాల్చినవాడు,బెస్త భక్కిని నిగ్గును తేల్చగ
పసిడి చేపను వలలో వేసెను నాయనారు ధర్మానురక్తిని దీవించగ
తాత్సారముచేయక పరవశంబున పసిడిచేపను పరమేశ్వరార్పణమును చేయగ
విస్తారపు కరుణను పొందగ బెస్తకు కనకపు చేపయే కారణమాయెనట
చిత్రముగాక ఏమిటిది చిదానందుని లీలలు గాక
చిత్తముచేయు "శివోహం" జపంబు నా చింతలు తీర్చుగాక.
"పత్రం-పుష్పం-ఫలం-తోయం' వీనిలో దేనినైనా భక్తితో సమర్పిస్తే,పరమేశ్వరుడు ప్రీతితో స్వీకరించి అనుగ్రహిస్తాడని పెద్దలు చెబుతారు.జలచరములైన జలపుష్పములను నిష్ఠగ సమర్పించి శివసాయుజ్యమును పొందిన బెస్త ఆదిపత్త నాయనారు."మత్స్య-కూర్మ-వరాహస్య-నారసింహస్య-వామన అన్న సూక్తినాధారముచేసుకొంటే ప్రళయానంతరము స్వామి ధరించిన మత్స్యావతారము అత్యంత మనోహరము.బాహ్యమునకు నాగ పట్టాణము దగ్గరనున్న నూలైపాడులో జన్మించిన ఆదిపత్త నాయనారు తాను పట్టిన చేపలలో ఒకదానిని క్రమము తప్పక శివనైవేద్యముగా నీటిలోని జారవిడిచేవాడు.సూక్ష్మమును చూస్తే హరిని సేవించి హరునికి దగ్గరగా చేర్చేవాడు.హరిహరతత్త్వమే ఆదిపత్త నాయనారు.
నిజ భక్తులను పరీక్షించుటయే నీలకంఠుని లీల.వరుసగ కొన్నిరోజులు ఆదిపత్త వలలో ఒకే ఒక చేప పడసాగింది.ఆహారమునుగురించి గాని,తనఆదాయమును గురించి గాని ఆలోచించకుండ నియమ ప్రకారము పడిన చేపను పరమేశ్వరార్పణము చేసేవాడు.పస్తులుండుటకుచింతించలేదు.పంతము అంతము చూడాలంటు త్రిపురాంతకుడు ఒకనాడు వలలో ఒకేఒక పసిడి చేపను పడవేసెను.ప్రలోభములను దరిచేరనీయకుండ
నిష్కళంక పూజగా దానిని పరమేశ్వరార్పణము చేసాడు నాయనారు.పరిణితి చెందిన భక్తిలో పరీక్షలకు తట్టుకునే శక్తి ఉంటుంది కదా.ఏ వేదంబు పఠించె లూత ,ఏ వేదంబు పఠించె ఆదిపత్త నిను చేర నిశ్చలభక్తి సోపానమని తెలియచేసిన ఆదిపత్త నాయనారును మెచ్చి అనుగ్రహించిన ఆ ఆదిదేవుడు మనందరిని ఆనుగ్రహించుగాక.
నిష్కళంక పూజగా దానిని పరమేశ్వరార్పణము చేసాడు నాయనారు.పరిణితి చెందిన భక్తిలో పరీక్షలకు తట్టుకునే శక్తి ఉంటుంది కదా.ఏ వేదంబు పఠించె లూత ,ఏ వేదంబు పఠించె ఆదిపత్త నిను చేర నిశ్చలభక్తి సోపానమని తెలియచేసిన ఆదిపత్త నాయనారును మెచ్చి అనుగ్రహించిన ఆ ఆదిదేవుడు మనందరిని ఆనుగ్రహించుగాక.
( ఏక బిల్వం శివార్పణం.)
Comments
Post a Comment