JAI SREEMANNAARAAYANA-23

మారిమలై మురైంజిల్ మన్ని క్కిడందు ఱంగుం శీరియ శింగం అరివుత్తు త్తీవిరిత్తు వేరి మయర్ పొంగ ఎప్పాడుం పేరుందు దఱి మూరి నిమిరిండు మురంగిప్పు ఱప్పట్టు పోదరుమా పోలే నీ పూవై ప్పూవణ్ణా ఉన్ కోయిల్ నిన్రు ఇంగనే పోందరిళిక్కో ప్పుడైయ శీరియ శింగాశ నత్తిరుందు యాం వంద కారియం ఆరాయ్ అందరుళ్ ఏలో రెంబావాయ్ . ఓం నమో నారాయణాయ-23 విచిత్రముగ నామది శ్రీవిల్లిపుత్తూరుగా మారినది విష్ణుచిత్తీయమై శ్రీహరి నామ సంకీర్తనమే కోరుతోంది హర్ష-వర్ష ప్రదమైన వ్రతమును చేయించు చున్నదైన గోదా తల్లి పలుకుచున్న " ఏలో రెంబావాయ్" లో అమ్మ పిలుపు వినబడి నిదురను చాలించిన వాడైన శీరియ సింగము భంగి గుహ వెడలిన స్వామిలో పరిమళ కేసరములు ప్రపంచీకరణమైన శంకలేని భక్తి చేయు గోపికల కైంకర్యములో సిం హాసనమధిస్టించమని వినయము వింజామరలైన వినుతుల తోడ్కొనిపోవు విభవ స్వాగతములలో అతి పవిత్రమైన వ్రతము ఆచరింప రారె ఆముక్తమాల్యద ఆండాళ్ అమ్మ వెంట నేడె. భావము చెలులను వ్రతమును చేయుటకు పిలుచుచున్న అమ్మ్మను,అమ్మ పిలుపువిని నిదురను చాలించి సిం హము వలె గుహనుండి బయటకు వచ్చిన స్వామిని,స్వామి అనుగ్రహమును తన కేసరములతో అంతా వ్య...