TIRUPPAAVAI-19 PAASURAM.

తిరుప్పావై-పాశురం-19 ********************* " నీళాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్థం స్వశృతిశతశిరస్సిద్ధమధ్యాపయంతీ స్వోచ్చిష్టాయాం స్రజనిగళితం యా బలాత్ కృత్యభుంగ్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏ వాస్తుభూయః." పూర్వ పాశుర ప్రాభవము ****************** పదిమంది గోపికలతో నందగోపభవనమునకు వచ్చి,వారిని నోమునకు రమ్మని వినతిచేసిన గోదమ్మ,నప్పిన్నాయ్ నీళాదేవిని మేల్కొలిపినది.బదులు రాలేదు వారికి.స్వామితో ఆమె ఏకాంతములో నున్నదని భావించినగోదమ్మ గోపికలతో పాటుగా వారిరువురిని మేల్కొలుటకు వచ్చినది. ప్రస్తుత పాశుర ప్రాభవము. *********************** రహస్యమును సదస్యము చేయుచున్నట్లుగా చర్మచక్షువులను భ్రమింపచేసే పాశురము,వారి అనుగ్రహమైనవేళ అత్యంత ఆఢ్యాత్మికము.అమృతగుళిక.మనకు అమ్మ-అయ్యల 1.దివ్య మైథునము 2.వారి మంచపు కోళ్ళు 3.దానిపై నున్న పరుపు 4.చుట్టు వేలాడుచున్న దీపములు 5.పరిమళములు 6.తలుపుతీయుటకు వారి సంభాషనము 7.అనుగ్రహించుచున్న స్వామిని అడ్డుకొను...