KADAA TVAAM PASYAEYAM-18

కదా త్వాం పశ్యేయం_18 ************************* "జిహ్వ చిత్త శిరోంఘ్రి నయనశ్రోతైః అహం ప్రార్థితం నమామి భగవత్ పాదం శంకరం లోకశంకరం." ",ప్రభు! త్వం దీనానాం ఖలు పరమ బంధుః పశుపతే ప్రముఖ్యోహం తేషామపి కిముత బంధుత్వ మనయోః త్వయైవ క్షంతవ్య "శివ"' మత్ అపరాధశ్చ సకలాః ప్రయత్నాత్ కర్తవ్యం మదవనయం బంధుసరణిః" నేను పశువును.నువ్వు పశుపతివి.మనిద్దరికి మధ్యన జగత్పిత-జగత్ పుత్ర బంధమున్నది అన్న విషయము లోకవిదితమే. కాని ఆ బంధము సమ్యక్ బంధము.సంపూర్ణ బంధము. అందులో నన్ను వీక్షించుట-నా తప్పులను క్షమించుట-నన్ను రక్షించుట అన్న మూడు విషయములు దాగిఉన్నవికదా .వానిని లోకవిదితముచేయుటకు మనది కేవల బంధముకాదని-సంబంధమని ,సదాశివుని కీర్తిస్తూ ,ఈ నాటి బిల్వార్చనమును ప్రారంభించుకుందాము. " ఓం నమః శివాయ." త్వరగా నడవవయ్యా శంకరయ్యా.నేను ఈ దొంగను అక్కడనున్న కార్యకర్తకు అప్పగించాలి.అసలే రద్దీగా ఉంటుంది.పైగా ఇతని అవలక్షణముల జాబితాను వల్లించాలి.ఆయనకునచ్చితేనే స్వామి దగ్గరకు అనుమతిస్తాడు.లేకపోతే మళ్ళీ స...