Posts

Showing posts from December 6, 2023

KADAA TVAAM PASYAEYAM-24

Image
      కదా  త్వాం  పశ్యేయం-24     *********************  "జిహ్వ చిత్త శిరోంఘ్రి నయన శ్రోతైః అహం ప్రార్థితం   నమామి భగవత్ పాదం  శంకరం లోక శంకరం"   " నిత్యం  యోగి మనః సరోజదళ  సంచారక్షమస్త్వక్రమః     శంభో తేన కథం కఠోర యమరాడ్వక్షః కవాట క్షతిః     అత్యంతం  మృదులం త్వదంఘ్రియుగలం హా మే మనశ్చింతయ     త్యేవత్ లోచన గోచరం కురువిభో హస్తేన సంవాహయే."    స్వామి యోగుల మానసములలో సంచరించుటకు  అనుకూలములుగా నీ పాదపద్మములు ఎంత సున్నితముగా నున్నవోకదా/సుకుమారమైన నీ పాదపద్మములు ఆ బాలుని (మార్కండేయుని) రక్షించుట కు అతికఠినమైన హృదయముకల యముని ఛాతిని తన్ని ఎంత కందిపోయినవో.వాటిని ఈ అభాగ్యునకు గోచరము కానిచ్చినచో ...వానినికందనీయక నా చేతులలో అలంకరింపచేసి,సేవించుకుంటాను.  " లోచన గోచరంకురు విభో" అని స్వామిని ప్రార్థిస్తూ,ఈ నాటి బిల్వార్చనమును ప్రారంభించుకుందాము.   అందరు హుటాహుటిగా మోటబావి దగ్గరకు వెళ్లారు.అప్పుడే పొలమునకు నీరుచేర్చి,తన రెందు చేతులలో రెండు తామరపుష్పములను ధరించి,వాటి వంక చూస్తూ,మాట్ల...

KADAA TVAAM PASYAEYAM-23

Image
     కదా  త్వాం  పశ్యేయం-23    ************************  "జిహ్వ చిత్త శిరోంఘ్రి నయన శ్రోతైః అహం ప్రార్థితం   నమామి భగవత్ పాదం శంకరంలోకశంకరం"  " స్తవైః బ్రహ్మాదీనాం, "జయజయ" వచోభిః నియమినాం    గణానాం కేళిభిః, మదకల మహోక్షస్య కకుది    స్థితం,  నీలగ్రీవం, త్రినయనం, ఉమాశ్లిష్ట వపుషం,   "కదా  త్వాం  పశ్యేయం" కరదృతమృగం ఖండపరశుం."  ప్రస్తుత శ్లోకములో నాదము నాలుగువిధములుగా నినదింపబడుతూ,నీలగ్రీవుని స్తుతిస్తున్నది. 1. మొదటి విభాగము స్తోత్రము.బ్రహ్మ మొదలగు వారు, స్వామి యొక్క పరాక్రమమునకు సంకేతముగా గండ్ర గొడ్డలి,ప్రసన్నత సంకేతముగా మృగమును చెరొక చేతి యందు ధరించి అంబా సమేతుడై అనుగ్రహించుచున్నారు.అని స్తుతించుచున్నారు.( సామీప్యాను గ్రహము -దేవతాగణములకు) 2.నియమినాం జయజయ వచోభిః  నియమపాలనా పరులైన మహర్షులు స్వామికి"మంగళాశాసనములను -జయజయ శంకర అంటూ చేస్తున్నారు.( ఇదికూడా సామీప్యానుగ్రహమే-ఋషులకు) 3 కేళిభి సేవనం కరోమి అంటున్నారుప్రమథులు.(ఇదికూడా సామీప్యానుగ్రహమే-కింకరులకు) 4.మహోక్షము వీరందరిని మించిన  అనుగ్రహ...