KADAA TVAAM PASYAEYAM-24

కదా త్వాం పశ్యేయం-24 ********************* "జిహ్వ చిత్త శిరోంఘ్రి నయన శ్రోతైః అహం ప్రార్థితం నమామి భగవత్ పాదం శంకరం లోక శంకరం" " నిత్యం యోగి మనః సరోజదళ సంచారక్షమస్త్వక్రమః శంభో తేన కథం కఠోర యమరాడ్వక్షః కవాట క్షతిః అత్యంతం మృదులం త్వదంఘ్రియుగలం హా మే మనశ్చింతయ త్యేవత్ లోచన గోచరం కురువిభో హస్తేన సంవాహయే." స్వామి యోగుల మానసములలో సంచరించుటకు అనుకూలములుగా నీ పాదపద్మములు ఎంత సున్నితముగా నున్నవోకదా/సుకుమారమైన నీ పాదపద్మములు ఆ బాలుని (మార్కండేయుని) రక్షించుట కు అతికఠినమైన హృదయముకల యముని ఛాతిని తన్ని ఎంత కందిపోయినవో.వాటిని ఈ అభాగ్యునకు గోచరము కానిచ్చినచో ...వానినికందనీయక నా చేతులలో అలంకరింపచేసి,సేవించుకుంటాను. " లోచన గోచరంకురు విభో" అని స్వామిని ప్రార్థిస్తూ,ఈ నాటి బిల్వార్చనమును ప్రారంభించుకుందాము. అందరు హుటాహుటిగా మోటబావి దగ్గరకు వెళ్లారు.అప్పుడే పొలమునకు నీరుచేర్చి,తన రెందు చేతులలో రెండు తామరపుష్పములను ధరించి,వాటి వంక చూస్తూ,మాట్ల...