AALO REMBAAVAAY-05

ఐదవ పాశురం *************** మాయనై మన్ను వడమదురై మైందనై తుయపెరునీర్ యమునై యరైవరై ఆయర్ కులత్తినిల్ తోన్రుం మణివిళక్కై తాయై క్కుడల్ విళక్కం శెయద దామోదరనై తూయోమాయ్ వందు నాం తుమలర్ తూవి త్తుళుదు వాయినాల్ పాడి మనత్తినాల్ శిందిక్క పోయ పిళైయుం పుగుదరువా నిన్రనవుం తీయనిల్ తూశాగుం శెప్పు ఏలోరెంబావాయ్. ఓం నమో భగవతే వాసుదేవాయ. పరమాత్మ తత్త్వమను వేదవృక్షమునకు విత్తనము వంటి తిరుప్పావై లోని ప్రథమభాగమైన మొదటి ఐదు పాశురములు స్వామి మనలనుద్ధరించుతకు తనకు తాను పర-వ్యూహ-విభ-సర్వాంతర్యామి తత్త్వములనుగ్రహించుతయే కాక అంతర్యామియై తన భక్త వాత్సల్యమును ఏ విధముగా తనకు తాను యశోదమ్మకు ఒక చిన్ని తాటితో కట్టబడినాడో సంకేతముగా వివరించుచున్నది గోదమ్మ. ఇక్కడ మనము ఒక చిన్న విషయమును గమనించవలెను .గోదమ్మ విత్తు అనినది.గింజ అనలేదు.ఈ రెండు పదములలో భావప్రకటనలో వ్యస్త్యాసమున్నట్లుంది. గింజలు మనకు ఆహారముగా అంతరించిపోవునవి.విత్తు తిరిగి తానొక మహావృక్షముగా రూపుదిద్దుకొని అనేక విత్తనములను సృష్టిస్తుంది.అదేవిధముగా తిరుప్పావై ఎందరెందరి మదిలో జీవనపరమార్థ భావములకు జీవము పోస్తుంది. ఇంకొక ముఖ్యవిషయము తూయోమాయ్ ...