TIRUPPAVAI-PASURAM-24

తిరుప్పావై-పాశురము-24 ***************** "నీళాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్థ స్వసృతి సతసిరస్సిద్ధమధ్యాపయంతీ స్వోచ్చిష్టాయాం స్రజనిగళీతం యా బలాత్ కృత్యభుంగ్తే గోదా తస్యైనమైదమివం భూయ ఏ వాస్తు భూయః. పూర్వ పాశుర ప్రస్తావనము ****************** ' గుహలో వర్షాకాలములోనిదురిస్తున్న సింహముగా స్వామిని దర్శిస్తూ,మేల్కొలుపుతూ,స్వామిపంచకృత్య విశేషములను సింహపు కదలికలతో సంకేతిస్తూ,స్వామినిగుహను విడిచి సింహగతితో నడచివచ్చి,సింహాసనమును అధిష్ఠించి,వారిసేవలను/అభ్యర్థనలనుస్వీకరించమని వేడుకొనిన జ్ఞాన సంపన్నులైన గోపికలు,జ్ఞానదశను సైతము అధిగమించి,ప్రస్తుత పాశురములో దానికన్నౌత్తమోత్తమమైన "ప్రేమ దశ"లోనికి ప్రవేశిస్తున్నారు.మనకు భగవత్ తత్త్వమును వివరిస్తున్నారు. ప్రస్తుత పాశుర ప్రాశస్త్యము. ****************** 1 పోట్రి పాశురము విశేష పాశురము. పరమాత్మను భగవంతునిగా ప్రదర్శించిన పాశురము. "నిర్వికార-నిర్గుణ-నిరంజన మూల తత్త్వము పరమాత్మ.స్థూలముగా పరమాత్మ థూలములో సూక్ష్మముగా దాగినప్రత్యగాత్మ." శ్రీకృష్ణ భగవానుడు మనకథానాయకుడు. భగవానువాచ అని ,భగవద్గీత అని మనం ...