DEVAKARYA SAMUDBHAVA-RAKTESVARI/KALI

" రక్తబీజ వధే దేవి చండ-ముండ వినాశిని రూపం దేహి జయందేహి యశోదేహి ద్విషోజహి" చందముండాసురులు చాముండ చేతిలో సమసిన తదుపరి దేవ-దానవ యుద్ధము కొత్తరూపును సంతరించుకున్నది. తరగని తామసము తనసైన్యమునంతటిని కూడ దీసుకుని తల్లిని వధియింప వచ్చుచున్నది.దానికి మేము సిద్ధము అంటూ దైతేయులు-కంబులు-అనేకానేక వీర్యులు-ధౌత్రులు-కాలకులు-మౌర్యులు-కాలకేయులు శుంభ-నిశుంభ పక్షమున సన్నద్ధమగుచున్నారు. వానితో కాసేపు వినెదించవలెననుకున్నదేమో మన తల్లి సప్త మాతృకలను పోరాదనిచ్చి వాని సైన్యమును సమరాంగనమును వీడిపారిపోవునట్లు చేసినది. ఈ ఘట్తములో తల్లి శివుని వానికదకు రాయబారిగా సాంతి సందేశతో పంపి శివదూతిగా కీర్తింపబడుతున్నది. సైన్యము పలాయనము చిత్తగించుతను చూసి తమతో పోరాడుచున్న సప్తమాతృకలకు ధీటుగా సుంభ-నిస్-శుంభులు రక్తబీజుని రణరంగమునకు పరిచయము చేసిరి. కొన్ని కథనముల ప్రకారము వీడు స్వయముగా మహిషుని తండ్రియైన రంభుడు అని దేవిపై పగ సాధించుతకై తన శరీరము నుండి కిందపడిన ప్రతి రక్తపుబొట్టు నుండి మరొక రక్తబీజుడు జనించు వరమును పొందియున్నాడు కనుక జయము తథ్యము అన్న నమ్మకము శుంభు...