ADITYAHRDAYAM-SLOKAM-19

ఆదిత్యహృదయం-శ్లోకము-19 ******************** ప్రార్థన **** "జయతు జయతు సూర్యం సప్త లోకైకదీపం హిరణ సమిత పాప ద్వేష దుఃఖస్య నాసం అరుణకిరణ గంయం ఆదిం ఆదిత్యమూర్తిం సకలభువన వంద్యం భాస్కరం తం నమామి." పూర్వ రంగము ********** పరంజ్యోతి యైన పరమాత్మ తమమును-హిమమును-శత్రువులను-కృతఘ్నతను సంపూర్ణముగా నాశనము చేసి ,నిర్ద్వంద్వ స్థితిని ప్రకటించినాడు అని చెప్పిన అగస్త్యభగవానుడు పునః సృష్టిని చేయుచు,నిరంజనుదైన స్వామి సర్వమలినములను హరించివేసి,రోచిష్ముడై, పుటము వేసిన అగ్నివంటి వర్ణముతో ,కన్నులముందు కనపడుతూ,కిరణములనే కరములతో ,పంచకృత్య భారమును వహించు వహ్ని వలె, "తప్తంచకర-తప్తచామీకరుడై-ఆ భా-సమస్తమును ప్రకాశవంతము చేస్తున్నాడు అంటూ,అగ్నిద్యోతక స్వరూప సూర్యనారాయణుని సంకీర్తిస్తున్నాడు. శ్లోకము ***** "తప్త చామీకరాభాయ వహ్నయే విశ్వకర్మణే నమః తమోభినిఘ్నాయ రుచయే లోకసాక్షిణే" విఘ్నేశ్వరనుగా విశ్లేషింపబడిన పరమాత్మ వటపత్రసాయియై, తదుపరి పునః సృష్టిని ప్రారంభిస్తున్నాడు.జలమయములైన జగములు తిర...