NAH PRAYACHCHAMTI SAUKHYAM-11

నః ప్రయచ్చంతి సౌఖ్యం-10 ***************************** భగవంతుడు-భక్తుడు ఇద్దరుసేనాపతులే-అన్నదానప్రియులే. " నమో బభ్లుశాయనివ్యాధినే అన్నానాం పతయే నమః." పరమేశ్వరుడు వృషభవాహనుడు.వృషభము ధర్మము.దుక్కిదున్ని దుర్భిక్షమును పోగొట్టును." నమో మేఘ్యాయచ" మేఘస్వరూపముగా స్వామి మారి వాని ద్వారా వర్షములను కురిపించును.హర్షమునందించును." నమో వర్షాయచ." " అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవః యజ్ఞాత్ భవంతి పర్జన్యో యజ్ఞ కర్మ సముద్భవః." మరొకవిశేషము తమసేనలకు అన్నమును అందించుటలో అతి విశాలహృదయులు. ప్రాణులు అన్నమువలన కలుగుచున్నవి.అన్నము మేఘము వలనకలుగుచున్నది.మేఘము జన్నము వలనకలుగుచున్నది.జన్నము సత్కర్మల వలన కలుగుచున్నది.సత్కర్మ వేదము వలనకలుగుచున్నది.వేదము అక్షర పరబ్రహ్మమైన సదాశివుని వలన కలుగుచున్నది సర్వలోక సేనాపతి సదాశివా నమో నమః.. భక్తుని విషయానికొస్తే, తంజావూరు జిల్లాలోని తిరునట్టి యాట్టంగుడి నివాసియైన కోట్పులి నాయనారు.చోలరాజ్య సేనాధిపతి.అతి పరాక్రమ వంతుడగుటచే పెద్దపులి అను పేరుతో ప్రసిధ్ధిపొందాడు.పరాక్రమమునకు...