bhookailas

నః ప్రయచ్చంతి సౌఖ్యం-21 ****************************** భగవంతుడు-భక్తుడు ఆలిని అర్థికిచ్చిన వారే. " నమ: శష్ట్ప్యాయచ ఫేన్యాయచ నమస్సికత్యాయచ ప్రవాహ్యాయచ" లేతగడ్డియందున్న వాడు శష్ప్యుడు నీటి నురుగునందున్న వాడు ఫేన్యుడు.ఇసుకగల ప్రదేశములు తనస్వరూపములుగా గలవాడు ప్రవాహములలో గలవాడు.అసలింతెందుకు? పవిత్రగంగాస్నానమాచరించి ప్రవాహముతో,దానిలోదాగిన నురుగుతో పునీతులై,తీరప్రదేశ ఇసుకతో శివలింగమును తయారుచేసుకొని,పక్కనే మొలిచియున్న దర్భలతో,అకుంఠిత దీక్షతో అర్చించు సాధకులలో,ఉదాహరణకు రావణబ్రహ్మ తల్లి కైకసి మాతగా ప్రజ్వరిల్లుచున్న పరమేశ్వరునకు ప్రణామములు. " దేవ మహదేవ మము కావుము శివా". జరుగవలసిన పరీక్షకు శ్రీకాళహస్తీశ్వరుడు జంబుకేశ్వరునికి తోడై జలధరుని లింగమును జరిపివేసినాడు.దైవ నిర్ణయములు దయాపాత్రములే అయినప్పటికిని కైకసి మాత దైనందిన పూజకు దారిని మార్చినది.తల్లడిల్లుచున్న తల్లిని చూసి తాళలేని కుమారుని,అందులోను పరమ శివభక్తుని ఆత్మలింగ అనుగ్రహమునకై కైలాసము వైపునకు అడుగులను కదిలించినది.కామితార్థమునిస్తాడో లేక కాగల కార్యమునక...