ALO REMBAVAAY-13

పదమూడవ పాశురం **************** పుళ్ళిన్వాయ్ కీండానై ప్పొల్లా అరక్కనై క్కిళ్ళి క్కళైందానై క్కీర్తిమై పాడిప్పోయ్ పిళ్ళైగళ్ ఎల్లారుం పావై క్కళం పుక్కార్ వెళ్ళి ఎళుందు వ్యాళంఉరంగిట్రు పుళ్ళుం శిలంబినకాణ్! పోదరికణ్ణినాయ్! కుళ్లక్కుళిర క్కుడైందే నీరాడాదే పళ్ళికిడత్తియో? పావాయ్! నీ నన్నాళాల్ కళ్ళం తవిరందు కలందేలో రెంబావాయ్. ఓం నమో భగవయే వాసుదేవాయ నమః. **************************** ఈ పాశురములో గోదమ్మ మనకు నాలుగు విషయములను ప్రస్తావిస్తూ,వాటి ప్రాముఖ్యతను వివరిస్తున్నది. మొదటిది-ఇంద్రియ దుర్వినియోగము-దాని ఫలితములు రెండవది-ఉషోదయ ప్రాముఖ్యత. మూడవది-భూమానందము. నాల్గవది-శబరి గొప్పతనము. తల్లి బకాసురవధను కీర్తిస్తున్నట్లుగా పాశురమును ప్రారంభిస్తోంది. పిళ్లైగళై-గోపికలందరు, (సంతోషముగా) పొల్లా-మాయావి యైన, అరక్కన్-అసురుని,అందున పక్షిరూపముగా తన కామరూప శక్తితో వచ్చిన వానిని, పుళ్ళన్-కొంగరూపముతో,అదియును అందమైన తెల్లని కొంగరూపముతో ఖదిరి వనమున ప్రవేశించిన వానిని, కీండానై-వాడి నోటిని/ముక్కును విభజించి/చీల్చి, కళందునె-సంహరించిన...