AALO REMBAAVAAY-05

ఐదవ పాశురం *************** మాయనై మన్ను వడమదురై మైందనై తుయపెరునీర్ యమునై యరైవరై ఆయర్ కులత్తినిల్ తోన్రుం మణివిళక్కై తాయై క్కుడల్ విళక్కం శెయద దామోదరనై తూయోమాయ్ వందు నాం తుమలర్ తూవి త్తుళుదు వాయినాల్ పాడి మనత్తినాల్ శిందిక్క పోయ పిళైయుం పుగుదరువా నిన్రనవుం తీయనిల్ తూశాగుం శెప్పు ఏలోరెంబావాయ్. ఓం నమో భగవతే వాసుదేవాయ. మోహనరూపా గోపాలా-ఊహాతీతము నీ లీల ******************** " పూర్ణమదం-పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణమిదుచ్యతే" అన్నది వేదవాక్యము.దానిని విశదముగా ఈ ఐదు పాశురములలో సమన్వయపరచినది గోదమ్మ.మరింత స్పష్టము చేయుచు,నారాయణుడని వైకుంఠ ప్రస్తావనచేసినది పూర్ణస్వరూపమునే.దాని పొందుట బహుదుర్లభము.సుదీర్ఘ ప్రయాసతో కూడుకొనిన ప్రయత్నము.ఘోర తపశ్శక్తి సంపన్నులకు మాత్రమే సాధ్యము.దానికంటె కొంచము సులభమైనది క్షీరాబ్ధిశయనుని శయనునిది పూర్ణస్వరూపమే( పొందగలుగుట).బ్రహ్మాది దేవతలకు తమ వినతులను మాత్రమే సమర్పించుకొను సదవకాశమును కల్పించునది.అందరికి దుర్లభము.దానికంటె కొంచము సులభతరమైనది అవతారమును పూర్ణస్వరూపమే. వైభవము.కాని అది కాలపరిమితిని-కారణ పరిమితిని అనుసరించు ని...