NA: PRAYACHCHAMTI SAUKHYAM-03

నః ప్రయచ్చంతి సౌఖ్యం-04 ***************************** " ద్రాపే అంధసస్పతే దరిద్రన్ నీలలోహిత" భగవంతుడు-భక్తుడు ఇద్దరు ఈశ్వరచైతన్యమే. అన్నాద్ భవంతి భూతాని-పర్జన్యాద్ అన్న సంభవః. అన్నము వలన జనులు మేఘముల వలన అన్నము ఉత్పత్తి అగుచున్నవి ( శ్రీమద్భగవద్గీత ) కరుణతో అన్నమును ప్రసాదించుచు ఆదిదేవుడు,భక్తితో అన్నమును ఆరగింపుచేయుచు అరివట్టాయ నయనారు పరమపూజ్యులు.హర హర మహాదేవ శంభో శంకర. ద్రాపే-ఓ శివా నీవు అఘోరరూపివై భక్తుల అన్నమును పాలిస్తావు.అదేవిధముగా ద్రాపే ఓ శివా ఘోర రూపివై పాపులను శిక్షిస్తావు.పాపము-పుణ్యము అనునవి,ఘోర-అఘోర రూపములు మేము చేసిన -చేయుచున్న పనుల ఫలితములే కాని అన్యము కాదు అను తెలివిని మాకు అనుగ్రహించు తండ్రీ అని వేడుకొను, అగస్త్య కమండలజలము నేలపై జారి,కావేరి నదిగా రూపాంతరమును పొంది, ప్రవహించుచున్న "గణమంగళ" పట్టణమున తాయినార్ అను సంపన్న గృహస్థుడు ధర్మపరాయణుడై యుండెను. " యే అన్నేషు వివిధ్యంతి పాత్రేషు పిబతే జవాన్" " తే పథాం పథి రక్షయ ఐలబృదాయ వ్యుధః." ఐలము అనగా అన్న సముదాయము అను అర్థ...