KADAA TVAAM PASYAEYAM-12

కదా త్వాం పశ్యేయం-12 ************************* " జిహ్వ చిత్త శిరోంఘ్రి నయన శ్రోతైః అహం ప్రార్థితం నమామి భగవత్పాదం శంకరం లోక శంకరం."… " జనన మృతి యుతానాం సేవయా దేవతానాం "న భవతి సుఖాలేశః" సంశయో నాస్తి తత్ర అజనిమం అమృతరూపం సాంబమీశం భజంతే య ఇహ పరమ సౌఖ్యం తేహిధన్యా లభంతే." ఆ పరమసౌఖ్యప్రదుడైన పరమేశ్వరుని మన మనోఫలకమునందు స్థిరముగా నిలుపుకుని ఈనాటి బిల్వార్చనను ప్రారంభిద్దాము. ఇంతకీ వీళ్ళు చెప్పే మహాదేవుడు ఒక్కడేనా లేక ఆ విప్రుడు చెప్పినట్లు,ఈ తాతగారు చెబుతున్నట్లు అనేకులా అన్న సందేహము , "కమర్థం దాస్యేహం భవతు" అన్న లక్ష్యమునకు అడ్డుగోడ కడుతూనే ఉంది (ధీకుల్యా) ఈశ్వరానుగ్రహమను "కిల్బిషరజమును" తన ప్రవాహలహరులచే పూర్తిగా నిర్మూలిస్తూ,"దిశంతీ విజయతాం" దీవెనలను అందిస్తున్నది. అదేసమయమున తన తుమ్మెదలతో ఆటను ఆపి అక్కడికి వస్తూ,ఆ తాతగారి మనవడు , ఏమిటి? మీరింకా ఇక్కడే,ఇలానే కూర్చుని ఉన్నారా? మాతాతయ్య కాసేపు నిద్రపోయి,కాసేపు శ్లోకములు పాడుకుని,మెల్లగా సాయంత్రం-అదే ప్రదోష సమయమంటాడులెంది అప్పుడు పూజచేసుకునికాని ...