AALO REMBAAVAAY-27

పాశురము-27 ************ "సమవర్తిత్వము సాధించునుకదా స్వామి నీదు తీర్మానము సమాశ్రయణము అందచేసినది మాకదే పెద్ద సన్మానము." మాలే మణివణ్ణా పాశురములో తమ నోమునకు కావలిసిన వస్తువులను అర్థిస్తున్నట్లుగా సాక్షాత్తుగా విభవోపేతుడైన స్వామిని అర్థించారు. ఇప్పుడు వారు కోరుకొనునది స్వామి సమాగమము.జీవాత్మ తన బాహ్యలక్షణములను విడిచి,పంచసంస్కారములను పొంది, పరమాత్మను సమీపించి స్వామి గుణవైభవములను అనుభవించగలుగుట.ఐహికములో తనలో సంకోచించుకు పోయిన శౌర్యం,వీర్యం,ధై ర్యం,చాతుర్యం,ఔదార్యం ,మాధుర్యం,జాజ్వల్యం,ఔచిత్యం అను స్వామి అష్టగుణములను ముక్తపురుషుడై వ్యాకోపింపచేసుకొని స్వామి సారూప్యమును-సాలోక్యమును-సాంగత్యమును అంతకు మించి సాయుజ్యమును చేరుటను మనకు అందించిన రామానుజ సోదరికి అనేకానేక దాసోహములను సమర్పించుకుంటూ,గోవిందానుభూతినందించు, "అక్కార్ అడిసెల్" అను కూడారై అను విశేష పాశురమును అనుగ్రహించినంతమేరకు అనుసంధానము చేసుకుందాము.అమ్మ కూడి ఇరందు కుళిరేందో అని స్వామి సంపూర్ణ సమాగమ సావకాశమును కల్పించు సమాశ్రయణములను వివరించిన విధానమ...