SREESUKTAM-05-CHANDRAAM HIRANMAYEEM

శ్లోకము చంద్రాం ప్రభాసా జ్వలంతీ శ్రియంలోకే దేవజుష్టాముదారాం తాం పద్మినీం శరణం అహంప్రపద్యే అలక్ష్మీం నశ్యతాం త్వాం వృణే. -ఓ జాతవేద అంటు, లక్ష్మీ దేవి అనుగ్రహమునకై అగ్ని సహాయమును అర్థించుచున్న సాధకుడు, 1.మొదటి శ్లోకములో "మ ఆవహ" అంటూ అహ్వానించమని కోరాడు. అహ్వానమును మన్నించి వచ్చుటయే కాదు, 2."అనపగామినీం' అంటూ రెండవ శ్లోకములో వచ్చిన తరువాత తనను వీడక శాశ్వతముగా ఉండునట్లు చేయుము. అంతేకాదు,ఓజాతవేద 3"అశ్వపూర్వాం రథమధ్యాం" అంటూ ఆమె తన దగ్గరకు వచ్చు సన్నివేశమును,తన ఇంద్రియములనే ఆశ్వములను సరైన మార్గములోఉంచుతూ,తన గుణ్డెచప్పుడు చేయు ప్రణవనాదము అనుసరించుచుండగా హ్రిదయరథ మధ్యమున ఆసీనమై తల్లి రావలెనన్న దర్శనాభిలాషను కోరాడు. 4.నాల్గవ శ్లోకములో, కాం అనిర్వచనీయమైన ఆ పరశక్తి నాకు అత్యమ్య విడదీయరాని సాన్నిహిత్యములో "ఉపహ్వయే" నా శ్వసగా మారిపోయి ఉండేలా చేయమని ప్రార్థిస్తున్నాడు. ప్రస్తుత శ్లోకములో శరణాగతి,ప్రపద్యే శరణమహం" అంటూ, బాహ్య-అంతర్ శుచికి సానుకూలతను క...