Posts

Showing posts from November 27, 2022

NA RUDRO RUDRAMARCHAYET-25(SIVANAMDALAHARI)

Image
 శ్లో : స్తవైర్-బ్రహ్మాదీనాం జయ-జయ-వచోభిర్- నియమినాం గణానాం కేళీభిర్ -మదకల-మహో క్షస్య కకుది స్థితం నీల-గ్రీవం త్రి-నయనం-ఉమాశ్లిశ్ట- వపుషం కదా త్వాం పశ్యేయం కర-ధృత-మృగం ఖండ-పరశుమ్    ప్రస్తుతశ్లోకములో శంకరులు సదాశివుడు        ఇంతకు పూర్వము అధర్మమును ఏ విధముగా అంతమొందించినో తెలుపు సంకేతములుగా త్రినయనం-మన్మథుని మాయంచేసిన నీ మూడవకన్ను ధర్మమునకు ప్రతినిధిగా ప్రకాశిస్తున్నది.నీ నీలకంఠము అసురత్వమును అణచివేసిన దానికి ప్రతీకగా ప్రతిబింబిస్తున్నది .ధర్మమునకు గ్లాని సంభవింపనీయని  నీ చతురతయే నీ ఒక చేతనున్న( విచ్చలవిడి మనస్తత్త్వమునకు సంకేతమైన) మృగము,మరొక చేతను దానిని దండించగల ఖండపరశువు.   అధర్మము అంతరించిన వేళ జరుపుకొను  ఆనందోత్సాహము బ్రహ్మాదుల స్తవములే కావచ్చును,మునుల జయ జయ ధ్వానముల                  స్తోత్రములే కావచ్చును,ఎద్దుమూపురమునెత్తి వేయు రంకెలే  కావచ్చును,ప్రమథగణములు చేయు వాయిద్య సంబరమైనా కావచ్చును.అంతటి సంతోషమునకు కారణము స్వామి ఉమాశ్లిష్టుడై వారికి సాక్షాత్కారమునొసగుటయే కారణము.నేను సైతము అంత...

NA RUDRO RUDRAMARCHAYET-24

Image
  శ్లో :  కదా వా కైలాసే కనక - మణి - సౌధే సహ - గణైర్ - వసన్ శంభోర్ - అగ్రే స్ఫుట - ఘటిత - మూర్ధాన్జలి - పుటః విభో సాంబ స్వామిన్ పరమ - శివ పాహీతి నిగదన్ విధాతౄణాం   కల్పాన్ క్షణమ్ - ఇవ వినేష్యామి సుఖతః     సదయ సుఖయ- సత్వర దర్శన భాగ్యమును అనుగ్రహించమని ప్రార్థించిన శంకరులు ప్రస్తుత శ్లోకములో " కదావై కైలాసే'అంటూ కనక్మణిశోభితమైన కైలాసములో,ప్రమథగణ సేవుతుడగుచున్న స్వామిని ఎప్పుడు చూడగలుగుతానో కదా అని దీనముగా వేడుకుంటున్నారు.  సందర్శన భాగ్యమును కోరిన ఆదిశంకరులు ప్రస్తుత శ్లోకములో సాయుజ్య భక్తిని ప్రసాదించమని కోరుతున్నాఉ.దృష్ట్వా-అదృష్ట్వా అను రెండు పదములతో నిత్యదర్శనానుగ్రహమును కోరిన శంకరులు,మనకు నమస్కార ముద్రను పరిచయము చేస్తున్నారు.ఎనిమిది వేళ్ళూ ఊర్థ్వముఖపయనమునకు సంసిద్ధమైనవేళ,రెండు వేళ్ళు సాధకుని అంతరంగము వైపునకు చూపిస్తూ,దశ ప్రాచీ-దశదక్షిణ అన్న తత్త్వానికి అద్దముపడుతుంటాయి.అద్వైత్వముగా జీవాత్మను ఒకచేతి ఐదువేళ్ళు చూపిస్తుంటే,పరమాత్మను మరో ఐదువేళ్ళుచూపిస్తు,జీవాత్మ-పరమాత్మ సంగమమునకు సంకేతమౌతున్నది.నమస్కారము.  ప్రస్తుత శ్లోకము,  కదావా వినే...

NA RUDRO RUDRAMARCHAYAET-23(SIVAANAMDALAHARI)

Image
  శ్లో :  కరోమి త్వత్ - పూజాం సపది సుఖదో మే భవ విభో విధిత్వం విష్ణుత్వమ్   దిశసి ఖలు తస్యాః ఫలమ్ - ఇతి పునశ్చ త్వాం ద్రష్టుమ్   దివి భువి వహన్ పక్షి - మృగతామ్ - అదృష్ట్వా  తత్ - ఖేదం కథమ్ - ఇహ సహే శన్కర విభో      23 సాధకుడు స్వామి క్షిప్రప్రసాదత్వమును కోరుకొనుచున్నాడు.అదియును నిరంతర దర్శనభాగ్యమును అభిలషిస్తున్నాడు. నిత్యపరమానంద సుఖమును స్వామి వీక్షణము వలన కలుగు పరమానందమును ఆదిశంకరులు కోరుకొనుచున్నారు. హేవిభో-హే పరమేశా! నీ సర్వవ్యాపకత్వమును తెలిస్కొనగలిగిన జ్ఞాననమును,సవమునందు నిన్న దర్శించగల వరమును ప్రసాదించుము. ఈ శ్లోకములో ఆదిశంకరులు స్వామి దర్శన సౌభాగ్యమును వరముగా అనుగ్రహించమని ప్రార్థిస్తున్నారు. పూజ అను పదము పునర్జన్మములేకుండా చేయుమని వేడుకొనుటకు సంకేతముగా పెద్దలు భావిస్తారు. ఆదిశంకరులు తాము స్వామిదర్శనమునకు నోచుకోని ఎడల సంభవించే దుఃఖమును భరింపజాలనని కనుక సర్వవేళలందును సన్నిధిలో నుండనిమ్మంటున్నారు. దర్శనాభిలాషను మరింత ప్రస్పుటముచేస్తూ దానికి అవరోధముగా నున్న అహంకారమును తనకు కలుగనీయవద్దన్న దానికి సంకేతముగా బ్రహ్మ హ...