KADAA TVAAM PASYAEYAM-17

కదా త్వాం పస్యేయం-17 ************************* " జిహ్వ చిత్త శిరోంఘ్రి నయన శ్రోతైః అహం ప్రార్థితం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం." "రోదస్తోయహృతః శ్రమేణ పథికశ్చాయాం తరోర్వృష్టితో భీతః స్వస్థగృహం గృహస్థమతిథిం దీనః ప్రభుం దీపం సంతమసాకులశ్చ శిఖినం శీతావృతస్థం తథౌ చేతః సర్వపాపహం వ్రజసుఖం శంభోపదాంభోరుహం." ఏవిధముగా నీటి ప్రవాహములో మునిగిపోతున్న వానికి దుంగ ఆధారమవుతుందో,అలిసిపోయినబాటసారికి వృక్షము ఆశ్రయమవుతుందో,జడివానలో తడుస్తున్న వానికి స్వగృహం సంరక్షణమును ఇస్తుందో,చీకటులను తొలగించి,దీపము ప్రకాశమును ఇస్తుందో,అదే సాపేక్షతానుసారముగా ,నా మనసు చుట్టుముట్టిన భయములను మహేశ పాదపద్మములు తొలగించునుగాక అన్న గట్టినమ్మకముతో త్రికరణ శుద్ధిగా పాదనమస్కారమును చేస్తూ,ఈనాటి బిల్వార్చనమును ప్రారంభిద్దాము. ఈనాటి శంకరయ్య గమ్యము కొరకు పయనిస్తున్న పథికుడు/బాటసారి.స్వామి కరుణ ఆయనకు దేనిని ఆశ్రయముగా అందిస్తుందో,ఏ సంఘటనము ద్వారా భక్తిని పెంపొందింపచేస్తుంద...