PADISAKTULA PARAMAARTHAMU-BHUVANESVARI

పదిశక్తులపరమార్థము-నాల్గవశక్తి-భువనేశ్వరి. ************************************* భువనేశ్వరి తత్త్వము గురించి క్లుప్తముగా మూడువిషయములను పరిచయము చేసుకుందాము. 1 భూగోళము-ఖగోళము భువనము అనగా ప్రపంచము.తల్లి తనవీక్షణతో పదునాలుగు భువనములను సృష్టించినది.భూగోళమునకు సహాయకారిగా ఖగోళమును సృష్టించి,దానిని విస్తరింప చేసింది.ప్రణాళిక ప్రకారమే జరిగినది.ఈ ప్రక్రియ.గ్రహములు-గ్రహగతులు నిర్ణయింపబడినది.అదేకద రాత్రింబవళ్ళు.విచిత్రముగా ఒక రోజు గడిచినది అంటాము గాని భూమి సూర్యుని చుట్టు తిరిగినది అనము. 2.కలి-ఆకలి. భూగోళ-ఖగోళ పరిభ్రమణము జీవులలో ఆకలినితెలియచేసినది.కరువు-కాటకముల ఇబ్బందులు తెలిశాయి.కలి తమకడుపులో లేదని మనకు తెలియచేసేది ఆకలి.కలో-గంజో అని మనము అంటుంటాము కదా.ఆకలి ని తొలగించుటకుభువనేశ్వరి శాకములను- ఫలములను-ధాన్యములను తన శరీరమునుండి ఉత్పత్తి చేసి శాకంబరి గా మారినది.కలిని కొనసాగించుటకు భూగోళము లోని వృక్షములకు-ఖగోళములోని సూర్యులకు మైత్రి కలిపి ,జలములకు మేఘములకు పొత్తు కలిపి ఆకలిదప్పులను తీర్చుచున్నది. 3.మనదేహము-మణిద్వీపము. మనదేహములోన...