SREESUKTAM-04--KAAM SAHA-SMITAAM-SOSMITAAM

శ్లోకము "కాం సోస్మితాం హిరణ్యప్రాకారం అర్ద్రాం జ్వలంతీం తృప్తాం తర్పయంతీం పద్మేస్థితాం పద్మవర్ణాం తాం ఇహోపహ్వయే శ్రియం. జాతవేదుని ప్రార్థిస్తున్న భక్తుడు ప్రస్తుత శ్లోకములో, ఇహ ఉపహ్వయే-లక్ష్మీదేవి తనకు ఎంతదగ్గరగాఉండాలంటే,తన శ్వాసలో నిలిచియుండునట్లు సహాయపడుమని ప్రార్థిస్తున్నాడు. లక్ష్మీదేవి తనదగ్గరకు రావాలి,వచ్చితనను వీడకుండాలి,తన మనో సంకల్పమును దృఢపరచినిరంతరము ప్రణవమును నినదించునట్లుచేయాలి వానితో పాటుగా తనశ్వాసలో నిరంతరము నర్తిస్తుండాలి అని కోరుకుంటున్నాడు. ప్రస్తుత శ్లోకము పరబ్రహ్మము కాం అను శబ్దముతో సూచించబడినది.క కారము బ్రహ్మ స్వరూపము. వాజ్మానస గోచరము కానిది "కాం" ఇది అని విశేషించి చెప్పజాలనిది.చూపించజాలనిది. ప్రకృతికి మూలకారణమై ఆధారభూతమైనది. పంచదశి మంత్రమే శరీరముగా భాసించునది కనుక "కాం" లక్ష్మీదేవి సోస్మితాం.సుందర దరహాసముతో తప్తకాంచన వర్ణముతో ప్రకాశించుచున్నది. ఆ తల్లి పద్మములో స్థిరముగా కూర్చునియున్నది.ఆ పద్మము పద్మాసనస్థయై పద్మవర్ణమ...