PASURAMU-06
తిరుచిట్రంబలం-పాశురము-06 **************************** మానే నీ నెన్నలై నాళివన్ దుంగళై నాణే ఎళుప్పువన్ ఎన్రళుం నాణామే పోనది శై పగరార్ ఇన్నం పులర్దిండ్రో వాణే నిలానే పిరవే అరివరియాన్ దానే వందెమ్మై తలయెడిత్తాల్ కొండొరుళుం వాణ్వార్ కళల్ పాడి వందోర్కుం వాయ్ తిరవాయ్ ఊనే ఉరుగాయ్ ఉనక్కే ఉరుం ఎమక్కుం ఏనోర్కుం తంగోనై పాడేలో రెంబావాయ్ నిజమేదో కల్లయేదో నీలకంఠుండెరుంగు ********************************** అంతరంగమందు అపరాధములు చేసి మంచివాని వలెను మనుజుడుండు ఇతరులెరుగక యున్న ఈశ్వరుడెరుగడా, అని వేమన నుడివి నట్లు ,తిరుమాణియవాచగరు మేల్కొలుపబడిన చెలుల వాక్చాతుర్యమును వివరిస్తూనే,ఒకామె తిత్తిక్క పేశువాయ్-వట్టి మాతలను మాత్రమే చెప్పినదని,మరొకామె పాలూర్ తేన్ పేశుం తేనెలో పాలలో నానిన పదార్థములు ఎంత మధురముగా ఉంటాయో వాటికంటె మధురమైన మాటలను మాత్రమే పలికినదని,ప్రస్తుత పాశురములోని చెలి,వీరిని మించిన వాక్చాతుర్యముతో తాను ముందటిరోజే వారి దగ్గరకు వెళ్ళి,తానే వారి నిదురను మేల్కొలుపుతానని చెప్పినది.కాని కార్యాచరణము జరుగలేదు. నీలవేణి మాటలు నీటిమూటలు-అన్నట్లుగా త్రి...