SARVASIDDHIPRADACHAKRAMU-PARICHAYAMU

" మహా బుద్ధిః మహాసిద్ధిః మహాయోగేశ్వరీశ్వరీ" అనుగ్రహముతో,సాధకుడు సర్వసిద్ధిప్రద చక్ర ప్రవేశముబకు యోగ్యతను పొందగలుగుతాడు. అదియును, " నీరాగా రాగమదనీ-నిర్మదా మదనాశినీ నిశ్చింతా-నిరహంకారా-నిర్మోహా మోహనాశినీ నిస్సంశయా సంశయఘ్నీ-నిర్భవా భవనాశినీ" కరుణా కటాక్షమే. వ్యాపినీ వివిధాకారా విద్యావిద్యా స్వరూపిణిగా/వ్యక్తావ్యక్తస్వరూపిణిగా నున్న పరమాత్మ, ప్రకాశమైన శివతత్త్వము+విమర్శరూపమైన శక్తి తత్త్వము అవ్యక్తమైన బిందురూపముగ విరాజమైనప్పటికిని సృష్టిచేయు సంకల్పముతో విమర్శ తాను ప్రకాసము నుండి విడివడి,ఇచ్ఛా-క్రియా-జ్ఞానశక్తులను బిందువులను కలుపుతూ అథోముఖ త్రికోణముగా ప్రకటనమైనది.ఇది మొదటి శక్తి కోణము.దీనికి తక్కిన కోణములతో సంబంధము కానరాదు. ఈ మూడు శక్తులనే , 1,మహా కామేశ్వరి 2.మహా వజ్రేశ్వరి 3.మహా భగమాలినిగా సంకీర్తిస్తారు. స్థూలములోని శక్తి కామేశ్వరి అయితే సూక్ష్మములో సామీప్యములోని యోగిని మహాకామేశ్వరి.ఈ తల్లినే బ్రహ్మీ శక్తిగాను ఆరాధిస్తారు.దేవీ భాగవత్ములో, "సంపత్కరీ సమారాధ్యా సిం...