AALO REMBAAVAAY-28

పాశురము-28 ************ " కానల గోవుల మేపుతున్నది జ్ఞానసంబంధములేనిది మా ఉపాధి కానిల గోకులమ్మను జననసంబంధము ఉన్నది ఓ దయానిధి" "స్వధర్మో- నిధనం శ్రేయః" అన్న ఆర్యోక్తిని నిరూపిస్తూ,పరంధాముని ప్రసన్నునిగా చేసుకొను సిద్ధోపాయమును సైతము అందించుచున్న గోదమ్మకు అనేకానేక దాసోహములను సమర్పించుకుంటూ అమ్మ అనుగ్రహించిన మేరకు పాశురమును అనుసంధానము చేసుకునే ప్రయత్నమును చేద్దాము. నిన్నటి పాశురములో గోపికలు అర్థించినవాటిని స్వామి తప్పక అనుగ్రహిస్తాడన్న విశ్వాసముతో వారు భావనావీధులలో బాహ్యమును మరచి భగవదానుభవమును ఆస్వాదిస్తున్నారు. "కన్నని చూచునొక్కతె-కనుసన్నల దాచునొక్కతె బింకముపోవు నొక్కతె-బిగి కౌగిట దాచునొక్కతె జలమును చల్లు నొక్కతె-జలజంబును తురుమగ కోరునొక్కతె దరహాసము చేయుచు దాగునొక్కతె-దరిచేరగ పిలుచు నొక్కతె పరిహాసముచేయుచు నొక్కతె-పర్యంకమున పరుండబెట్టొకతె తనవాడే-తనవాడే -తనావాడేననుచును తాదాత్మ్యము తోడుగ పరవశులైన పడతులతో -పలు-పలు లీలల ప్రకటనములతో యదుకులభూషణుని పొదివిన యమునాతటి ఎంతటి భాగ్యశాలియో రసరమ్యతనొంది తరించెను రమణీరమణుల రాసలీలలన్." ఇరువది ఎని...