SARVAROGAHARA CHAKRAMU-PARICHAYAMU

"రవి సుధాకర వహ్నిలోచన రత్నకుండల లోచనీ ప్రవిలమంబుగ మమ్మునేలిన భక్తజన చింతామణి అవని జనులకు కొంగుబంగారైన దైవశిఖామణి శివుని పట్టపు రాణి గుణమణి శ్రీగిరి భ్రమరాంబికా." పరమేశ్వరి అనుగ్రహముతో సాధకునితో పాటుగా మనముకూడా చంద్ర ప్రస్తావనతో కూడిన అమృతమయ "సర్వరోగహర హక్రములోనికి"ప్రవేశించుచున్నాము. లలితా రహస్య సహస్రనామ స్తోత్రము, "రోగపర్వత దంభోళి మృత్యుద్వారా కుఠారికా" అని కీర్తించింది. రుగ్మతను కలిగించేది (జాడ్యమును) రోగము.అది సప్తధాతు సమన్వయలోపముచే సంభవించు శారీరకము కావచ్చును.లేదా, అసహనము,అసంతృప్తి,అహంకారము,అసూయ,అధర్మము,అజ్ఞానము మొదలగు మానసికరుగ్మతలకు సంబంధించినదైనను కావచ్చును. ఒక్క మాటలో చెప్పాలంటే చేతనుని జ్ఞానము నుండి మాయ మార్గమునకు తీసుకుని వెళ్ళే శక్తులన్నీ రోగములే. ఎనిమిది కోణములు త్రిగుణములకు,శీతోష్ణములకు,సుఖదుఃఖములకు,కోరికకు సంకేతములుగా భావిస్తారు. మరికొందరు అష్టదిక్కులకు ప్రతీకగాను కీర్తిస్తారు. సాధకుడు షట్చక్రములను దాటుతూ సర్వఖేచరి/ఆకాశసంచారిణి యైన చైతన్యమును తెలుసుకోవటము ప్రారంభిస్తాడు. ...