AALO REMBAVAY-04

నాల్గవ పాశురము ************* ఆళిమళై కణ్ణా! ఒన్రు నీ కై కరవేల్ ఆళియుల్ పుక్కు ముగందు కొడార్ త్తేరి ఊళి ముదల్వన్ ఉరువం పోల్ మెయికరుత్తు పాళియన్ తోళుడై ప్పర్బనాబన్ కైయిల్ ఆళిపోల్ మిన్ని వలంబురి పోల్ నిన్రదిందు తాళాదే శార్ఙ్ ముదైత్త శరమళై పోల్ వాళ ఉలగనిల్ పెయిదిడాయ్ నాంగళుం మార్గళి నీరాడ మగిళిందు ఏలోరెంబావై. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః ఓంగి ఉలగళంద్ పాశురములో స్వమి తానే త్రివిక్రమ వేషధారియై అవతారలీలావిశేషములౌ ప్రస్తుతించిన గోదమ్మ ప్రస్తుత పాశురములో స్వామి తాను సూత్రధారియై,వరుణదేవుని పాత్రధారునిగా మలచి,పద్మనాభస్వామి స్వరూప-స్వభావ-విభవములతో పోలుస్తు,వరుణదేవుని లోక సంరక్షణాకార్యనిర్వాకునిగా అదియును పాపపుణ్యములను లెక్కించని సర్వత్ర వానగా స్వామి ఆనగా వర్షించు అని ప్రార్థిస్తున్నది.వారి నోము లోక సంక్షేమమునకు గాన జలకములాడుటకు తగిన వనరులను అర్థించుచున్నది. ఆళ్వారులు (ఆచార్యులు) వరుణదేవుని వంటివారు.వారు భగవత్ గుణములనెడి జ్ఞాన సముద్రములో పూర్తిగా మునిగి,భగవత్తత్త్వను నీటిని నిశ్శేషముగా త్రాగి,నిరంతరము నీలమేఘశ్యామునితో రమించుట వలన నల్లగా స్వామి మేనిఛాయను పొందుతారట.ఎంతటి భాగ్యశ...