ADITYAHRDAYAM-02
.jpg)
శ్లోకము-02 ******** " దైవతైశ్చ సమాగమ్య "ద్రష్టుం" అభ్యాగతో రణం ఉపగమ్యాబ్ర విద్రామ అగస్త్యో "భగవాన్-ఋషిః" పద విభాగము *********** రణం-ద్రష్టుం-యుద్ధమును వీక్షించుటకు దైవతైశ్చ్య-సమాగమ్య-దేవతలతో సహా భగవాం-ఋషి-విశేషపదములు అగస్త్యో-అగస్త్యమహాముని గమ్యా-రణస్థలికి వచ్చెను. విదామ-ఉపగమ్యబ్ర-తాను ఒక్కడే రామునికి దగ్గరగా వెళ్ళెను. భావము ****** భగవానుడు-ఋషి అయిన అగస్త్యుడు దేవతలతో కలిసి యుద్ధమును వీక్షించుతకు వచ్చి,తానొక్కడు మాత్రమే రామునికి అతిదగ్గరగా వెళ్ళెను.(కర్తవ్యబోధనమునకై) ఇప్పుడు విశేష శబ్దములను ప్రస్తావించుకుందాము. కథనము ప్రకారము అగస్త్యభగవానుడు దేవతాసక్తులతో యుద్ధమును వీక్షించుటకు వచ్చి,తానొక్కడే రాముని సమీపించినాడు.అనగా ఇది అత్యంత గోప్యము.వాల్మికి మహర్షి అగస్త్యునకు భగవాన్-ఋషి అను రెండు విశేష గుణములను ప్రస్తావించినాడు.కనుకనే "ద్రష్టుం" అన్న పదమును అగస్త్యునకు అన్వయిస్తే యుద్ధము-దాని పరిణామములను ముందే దర్శించగలిగిన మహాజ్ఞాని. విష్ణు పురానములోనిర్వచించినట్లు, "ఉత్పత్తి-ప్రళ...