TIRUPPAAVAI-PAASURAM-23.

తిరుప్పావై-పాశురము-23 ***************** "నీళాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్థ స్వసృతి సతసిరస్సిద్ధమధ్యాపయంతీ స్వోచ్చిష్టాయాం స్రజనిగళీతం యా బలాత్ కృత్యభుంగ్తే గోదా తస్యైనమైదమివం భూయ ఏ వాస్తు భూయః. పూర్వ పాశుర ప్రస్తావనము ****************** 'అకించిన్యం" -నాఉపాధి సమర్థవంతము కానిది " అనన్య గతిత్వం" అది కదులుట నీ చైతన్యము వలననే అన్న యదార్థమును గ్రహించిన గోపికలు,అన్-కణ్-మాన్యాలు-అందమైన-విశాలమైన-రాజ్యాలు తృనప్రాయముగాగుర్తించి,స్వామిని సర్వవాహన సేవాసౌభాగ్యమును కీర్తిస్తున్నారు. ప్రస్తుత పాశుర ప్రాశస్త్యము. ************************** సింవాహనునిగా-సింహముగా స్వామినికీర్తించిన ప్రస్తుత పాశురము స్వామిపంచకృట్యములను,సింహపు కదలికలతో సంకేతించి,సింహాసనారూఢునిగా దర్శింపచేసినది. 1.అది వర్షాకాలమట.స్వామి సివంగినికూడి సిమ్హములా గుహలోనిదురించినాడట. అంటే అది ప్రలయసమయము.అనేకము ఏకమయిన సృష్టికి పూర్వ స్థితిలో నున్నాడు. 2.అరివిత్తు-తెలివితెచ్చుకుని స్ర్ష్టి సంకల్పముచేయుట కళ్ళు తెరచుట. ...