KADAA TVAAM PASYAEYAM-15

కదా త్వాం పశ్యేయం-15 ********************** " జిహ్వ చిత్త శిరోంఘ్రి నయన శ్రోతైః అహం ప్రార్థితం నమామి భగవత్పాదం శంకరం లోక శంకరం". " దూరీకృతాని దురితాని దురక్షరాణి దౌర్భాగ్య దుఃఖ దురహంకృతి దుర్వచాంసి సారం త్వదీయ చరితం నితరం పిబంతాం గౌరీశ మాం ఇహ సముద్ధర సత్కటాక్షైః" శంకరయ్యతో పాటుగా నేనుకూడా చేసిన అపరాధములను క్షమించి,మహాదేవుడు మనందరిపై తనకృపావీక్షణములను ప్రసరించమని త్రికరణశుద్ధిగా ప్రార్థిస్తూ,ఈ నాటి బిల్వార్చనమును ప్రారంభిద్దాము. పక్షులన్నీ కలిసి క్షమాపణమును అర్థిస్తున్నాయి. ఆశ్చర్యముతో వాటినిచూస్తున్నాడు శంకరయ్య. ఇంతలో అటువైపు వెళుతున్నా వారు ఒక్క క్షణము ఆగి, ఓ అర్జున వృక్షమా!, నీవు మూడు వేదములు- నమామి నీవు మనోహరమైన దానివి-నమామి నీవు-త్రిగుణములను-త్రిపురములను- త్రిశరీరములను జయించిన దానివి-నమామి నీవు ఆదివి-ప్రారంభుము నీవే-నమామి నీవు త్రినయనం-సూర్య-చంద్ర-అగ్నులను నేత్రములుగా గలదానివి-నమామి. నీవు జటాభారోదరాం-నీ జటలలో సర్వమును చుట్టుకున్నదానివి-నమామి నీవు చలత్+ఉరగ...