Posts

Showing posts from November 13, 2021

MAIPORUL NAYANARU

మెయిపొరుల్ నాయనరు **************** అంతా పరమాత్మ స్వరూపమే అని నమ్మేవాడు పొరుళ్ ఈ విశ్వము విశ్వశ్వరుని స్వరూపము అన్న సత్యమును నమ్మేవాడు కనుక మెయి పొరుళ్,మై పొరుల్ నాయనారుగా కీర్తించబడుతున్నాడు.తిరుక్కోయిలూరులో వీరత్తరేశ్వరుని కొలుచు పరమ శివ భక్తుడు.సేది దెశమును ఏలినవానిగా కొందరు సేది నాయనారు అని కూడా కీర్తిస్తారు రాజుగా ఉత్తమ నాయకుడిగా ప్రజాపాలనను కొనసాగించినవాడు కనుక ఆ హోదాను గౌరవిస్తూ, మిలాద్ ఉడయార్-మిలాద్ నాయకుడు అని కూడా సంబోధిస్తారు. ఈ నాయనారు బద్దెన కవి సుమతీశతకములో చెప్పినట్లు, 'అపకారికి నుపకారము నెపమెన్నక చేయువాడు నేర్పరి సుమతీ" అన్న సుభాషితమునకు నిలువెత్తు నిదర్శనము. తమ ఊరిలోని శివాలయములలోనే కాక రాజ్యములో పలుప్రాంతములలో పరమేశ్వారాధనమును కొనసాగించేవాడు.స్త్రీ-పురుషులు.పిన్నలు-పెద్దలు,ధనిక-పేద,మొదలగు బాహ్య వ్యత్యాసములను అధిగమించి ప్రతి ఒక్కరిలో పరమేశ్వరుని చూడగలిగి,భావించగలిగి,భాషించగలిగి,ఆరాధించగలిగిన ప్రావీణ్యమును పొందిన పుణ్యశాలి. రాజ్యము-రాజు-ప్రజలు సుభిక్షముగా నున్న సమయమున ఆది భిక్షువు తన ఆతను ప్రారంభందలచాడు.ఆపగలవారెవరు? పొరుగు రా...

RUDRA PASUPATI NAYANARU

URUTTIRU PASUPATI NAYANAR తిరుతొండర్దొగై సనాతన వైదిక బ్రాహ్మణ కుటుంబమున తిరుతలయూరు నందు జన్మించారు.త్రికాలములందు తలలోతు -తిరుతలయూరు నందలి పార్వతీ శ్రీ బాలేశ్వర స్వామి పుష్కరిణీ తీర్థమునందు తలలోతు మునిగి రుద్రపారాయణను అదే నమ్మినవాని అర్చనగా నమకచమక పారాయణమును చేసేవాడు.భవ పాశములను తొలగించే పతి ని కొలిచేవాడు శివుడుగా -- నిద్రాహారములు దరిచేరుటకు ధైర్యము చేయలేకపోయేవి.అన్యమునకు స్థానము నాస్తి నాస్తి.శ్వాస మాత్రమే రుద్రనాయనారు అనుష్టానమునకు ఆలంబనగా ఉండేది. ఇక్కడ మనము కొంచము పరిశీలితే అనేకానేక జన్మల చక్రములలో నిరంతరముగా తిరుగుచున్న జీవునికి దాని నుండి విముక్తి లభిచాలంటే దానికంటే బలమైన శక్తి అవసరము.ఆ సక్తి సత్యమైనది-శుభప్రదమైనది-శాశ్వతమైనది అయితేనే తాత్కాలితను తొలగించగల సామర్థ్యతను కలిగియుంటుంది. మనకు పాశము-పశుపతి-పశువు అను మూటిని కనుక పరిగణిస్తే , పాశమును వేయగల/తీయగల సామర్థ్యము కలవాడు శాశ్వతుడు.పాశము శాశ్వతుని చేతిలో నున్నది కనుక అదియును శాశ్వతమే.కాకపోతే పశుపాశ బంధితుడు తన పూర్వజన్మల పుణ్య-పాప కర్మల అవశేషములను ముగించుకొనుటకై ,పునరపి జననం-పునరపి మ...

MURKHA NAYANAR

మూర్ఖ నాయనారు ***************** ఈ నాయనారు అసలు పేరు మరుగున పడినప్పటికిని,జూద నిపుణుడు కనుక నర్సూదన్ నాయనారు అని అన్నదానమునకు సప్తవ్యసనములలో మొదటిదైన జూదమును ఆధారముగా చేసికొనిన వాడు కనుక మూర్ఖ నాయనారుగా ప్రసిధ్ధిపొందెను. తొండైనాడు లోని తిరువెర్కుడం లో జన్మించిన నాయనారు, " అన్నద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవః యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞః కర్మ సముద్భవః" అన్న సిధ్ధాంత ప్రకారము, యజ్ఞము చేత వర్షము వర్షము వలన అన్నము అన్నము వలన సమస్త ప్రాణకోటి ఏర్పడును. అన్నం అంటె అన్నమయకోశ శరీరముగా మనము భావించుకోవాలి. అంటే అణు-పరమాణు సముదాయమైన శరీరము. నాయనారు తన చిన్నతనము నుండి శివభక్తులను శివస్వరూప భావంతో సేవిస్తూ,వారికి మధురపదార్థములను అన్నముతో పాటు వడ్డిస్తూ,వారు తృప్తిగా తినిన తరువాతనే తాను భుజించేవాడు. అనవరతము ఆతంకములేకుండా దేనిని సాగనీయడు కదా ఆ సాంబశివుడు. హరుని ఆన దాటనంటూ నాయనారు సంపదలను హరించివేయసాగినది కాలము.ఉన్న వస్తువులన్నీ అమ్ముడుపోయి కిమ్మనకున్నాయి.అయినా ఏమాత్రము బాధపడకుండా, అన్నము పరబ్రహ్మ స్వరూపము. అన్ని...