MAIPORUL NAYANARU
మెయిపొరుల్ నాయనరు **************** అంతా పరమాత్మ స్వరూపమే అని నమ్మేవాడు పొరుళ్ ఈ విశ్వము విశ్వశ్వరుని స్వరూపము అన్న సత్యమును నమ్మేవాడు కనుక మెయి పొరుళ్,మై పొరుల్ నాయనారుగా కీర్తించబడుతున్నాడు.తిరుక్కోయిలూరులో వీరత్తరేశ్వరుని కొలుచు పరమ శివ భక్తుడు.సేది దెశమును ఏలినవానిగా కొందరు సేది నాయనారు అని కూడా కీర్తిస్తారు రాజుగా ఉత్తమ నాయకుడిగా ప్రజాపాలనను కొనసాగించినవాడు కనుక ఆ హోదాను గౌరవిస్తూ, మిలాద్ ఉడయార్-మిలాద్ నాయకుడు అని కూడా సంబోధిస్తారు. ఈ నాయనారు బద్దెన కవి సుమతీశతకములో చెప్పినట్లు, 'అపకారికి నుపకారము నెపమెన్నక చేయువాడు నేర్పరి సుమతీ" అన్న సుభాషితమునకు నిలువెత్తు నిదర్శనము. తమ ఊరిలోని శివాలయములలోనే కాక రాజ్యములో పలుప్రాంతములలో పరమేశ్వారాధనమును కొనసాగించేవాడు.స్త్రీ-పురుషులు.పిన్నలు-పెద్దలు,ధనిక-పేద,మొదలగు బాహ్య వ్యత్యాసములను అధిగమించి ప్రతి ఒక్కరిలో పరమేశ్వరుని చూడగలిగి,భావించగలిగి,భాషించగలిగి,ఆరాధించగలిగిన ప్రావీణ్యమును పొందిన పుణ్యశాలి. రాజ్యము-రాజు-ప్రజలు సుభిక్షముగా నున్న సమయమున ఆది భిక్షువు తన ఆతను ప్రారంభందలచాడు.ఆపగలవారెవరు? పొరుగు రా...