TIRUPPAAVAI-PASURAMU-08

తిరుప్పావై-పాశురం 08 ***************** " మాతః సముత్థితవతీ మదివిష్ణుచిత్తం విశ్వోప జీవ్యమమృతం వచసా దుహానాం తాపఛ్చదం హిమరుచేరివ మూర్తిమన్యాం సంతః పయోధి దుహితః సహకాం విదుస్త్వాం". పూర్వ పాశుర ప్రస్తావనము ******************* శబ్దము-శ్రవనము అను అంశములతో పక్షులను-భారధ్వాజ పక్షులను సంకేతించి,తెల్లవారుచున్నదనుచు,ఇద్దరు జ్ఞానమూర్తులను తన వెంట తీసుకుని,మూడవ గోపికను నిదుర లేపుటకై,ప్రస్తుత పాశురములో "దృశ్యము-నయనము" ను తూరుపు దిక్కు-తెల్లదనమును సూచిస్తున్నది గోదమ్మ. ప్రస్తుత పాశుర ప్రాభవము ***************** ప్రస్తుత పాశురము బయటనున్న గోపికలు తమతో మాట్లాడుతున్నట్లు భావిస్తూ,సంభాషణా చతురతతో సాగుతుంది. మూడవ గోపిక-నోముపై కుతూహలము కలది-కోగులం ఉడయ. స్వామిని త్రికరన శుద్ధిగా ఆశ్రయించుట-స్వామి అనుగ్రహించుట అను రెండు విషములను ప్రస్తావించినది గోదమ్మ అరుళ్ అన్న పదముతో. శబ్దము-శ్రవనము అన్న అంశముతో పక్షులు-భారధ్వాజ పక్షులను స్తోత్రములను,శంఖనాదములను సంకేతిస్తూ శ్ర...