PASURAMU-08
తిరుచిట్రంబలం-పాశురం-08 **************************** తిరువెంబావాయ్-008 ****************** కోళి శిలంబ చిలంబుం కురుగెంగు ఎళిలియంబ ఇయంబువేన్ శణ్గెంగుం కేళిల్ పరంజోది కేళిల్ పరంకరుణై కేళిల్ విళుప్పోరుల్కళ్ పాడినో కేట్టిలైయో వాళియదెన్న ఉరక్కుమో వాయ్ తిరవాయ్ ఆళియున్ అంబుదమై ఆమారుమివ్వారో ఊళి ముదల్వనాయ్ నిన్ర ఒరువనై ఏలై పంగళనయే పాడేరేలొ రెంబావాయ్. ప్రళయ సాక్షియే పోట్రి అర్థనారీశ్వరయే పోట్రి *************** తిరుమాణిక్యవాచగరు ప్రస్తుత పాశురములో ప్రళయసాక్షిగా నున్న ఒకే ఒకడుగా మిగిలిన పరమాత్మ గుఇంచి ప్రస్తావిస్తూనే,మనలను చైతన్యవంతులుగా మలుచుతకు సులభమైన ఉదాహరనలతో, " అజాయ మాన బహుధా విజాయతే" అన్న సూక్తిని ప్రవేశపెట్టి నిద్వందమైన -ఒరువన్ ఒక్కటిగా గల పరమాద్భుతమును ముందు ద్వంద్వములుగా మనకు పరిచయము చేసినారు. ఇప్పటివరకు నిదురించుచున్న చెలులను మేల్కొలుపునపుడు ఉషోదయమును గురించి ప్రస్తావించలేదు. కాని ప్రస్తుత పాశురములో మన్ము వాటికన్న ఎంతో గొప్పవాళ్లమనుకొనే భావనలో నున్న మనలను చైతన్యపరచుటకు, కోళి శిలంబ-తెల్లవారుచున్నదన్న విషయమును తెల్లబరచుటకై కోడి కూయుచున్నది అని స...