0005
. అమ్మకు సభక్తిపూర్వక నమస్కారములతో ప్రసీద మమ సర్వదా-05 ****************** స్కందమాత నమోనమః ******************* "సింహాసన గతా నిత్యం పద్మాశ్రిత కరద్వయా శుభమస్తు సదాదేవి స్కందమాతా యశస్వినీ" ఇంతవరకు జగన్మాత నిర్ద్వంద్వ రూపిణిగా నిరుపమాన ప్రతిభతతో జగములను సృష్టించింది."ఏకైవాహం బ్రహ్మం" అన్న నానుడి మరొక శుభపరిణామమునకు శ్రీకారముగా మహాశక్తి తన ఒడిలో మరొక అద్భుత శక్తితో మనకు దర్శనభాగ్యమును అందిస్తున్నది. ఎంత తియ్యటిమామిడి పండో అంటూ నేడు మనము ఆస్వాదించగలుగుతున్నామంటే ,ఎంతో కాలానికి ముందు.ఎవ్వరో మహానుభావుడు మామిడిటెంకను భూమిలో నాటడము జరిగిదింది.భూమి దానికి తనశక్తిని అందించి,అగ్ని చైతన్యమును అందించి మొలకగా మార్చినది.వరుణుడు అందించిన జలములతో మొలక మొక్కగా మారినది.మొక్క సూర్యకిరణములనుండి పత్రహరితమునుచంద్రుని వెన్నెలలోని ఔషధశక్తులను తనలో నింపుకుంటూ కొమ్మలతో వాయువందిస్తున్న శక్తిని తనలో నింపుకుంటూ పంచభూతాత్మక పోషణలో మహా వృక్షముగా రూపుదిద్దుకుని మధురఫలములను మనకు అందిస్తున్నది.ఇది లౌకిక ఉదాహరణము. పంచభూతాత్మికం పరమశివం అన్నది కాదనలేని సత్యము....