KADAA TVAAMPASYAEYAM-20

కదా త్వాం పశ్యేయం-20 ********************** " జిహ్వ చిత్త శిరోంఘ్రి నయనశ్రోతైః అహం ప్రార్థితం నమామి భగవత్ పాదం శంకరం లోకశంకరం". " ధర్మోమే చతురంఘ్రికః సుచరితః పాపం వినాశం గతం కామ క్రోథ మదాదయో విగళితా కాలాః సుఖావిష్కృతః జ్ఞానానంద మహౌషధః సుఫలితా కైవల్యనాథే సదా మాన్యం మానస పుండరీక నగరవ్ రాజా వసంత స్థితే." ఓ కైవల్యప్రదాతా! నా చిత్తమను సు క్షేత్రమునందు (పంటభూమి) నీవు క్షేత్రజ్ఞుడవై/కాపువై-భక్తి అనే విత్తులను నాటు తూ,అవి నేనే నాటుతున్నానన్న భ్రమలో నేనున్నప్పటికిని,విత్తులతో పాటుగా పెరుగుటకు ప్రయత్నించు,పాపములను కలుపుమొక్కలను పెకలించివేస్తూ,సస్యకేదారుడవై,-పంట గా "జ్ఞానసాధనమనే ఔషధమును/ఆహారమును 'ప్రతినిత్యము(మూడు నెలలకు/ఆరు నెలలకు,ఏదాదికి ఒకసారి కాకుండా) అందచేయమనై ప్రార్థిస్తూ,నాలుగుపాదముల ధర్మము నడుచు చిత్తముతో,ఈ నాటి బిల్వార్చనమును ప్రారంభించుకుందాము. దిశానిర్దేశము చేయాలనుకున్న నిటలాక్షుని కరుణ శంకరయ్య ను బహ...