NA RUDROE RUDRAMARCHAYAET-30

న రుద్రో రుద్రమర్చయేత్-30 ********************* "ఎవ్వనిచే జనించు జగమెవ్వని లోపల నుండు లీనమై ఎవ్వడి ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం బెవ్వడనాది మధ్య లయుడెవ్వడు సర్వము తానైన వా డెవ్వడు వాని నాత్మభవు ఈశ్వరుని, నే శరణంబు వేడెదన్." బమ్మెర పోతన మహాకవి.(గజేంద్ర మోక్షము) స్థూలమును గమనిస్తూ,దానిలో దాగిన సూక్ష్మమును గ్రహించగలుగుటయే ఈశ్వరానుగ్రహము. స్థూలములో తాబేటిని చూస్తుంటే దాని అవయములను కాసేపు ముడుచుకొని,తన డొప్పలో దాచేసుకొని,మరికొంత సేపు బయటకు విస్తరింపచేస్తూ,తాను మాత్రము ఎటువంటి వికారమును పొందకుండా స్థిరముగా నుండు సూక్ష్మ భగవతత్త్వమును అర్థముచేసుకొనగలుట భగవంతుని మీఢుష్టత్వము. నిక్షిప్త-ప్రక్షిప్త శక్తులను సమయానుకూలముగా వ్యక్తీకరిస్తూ,విశ్వపాలనమును నిర్వహించు పరమాత్మను, నేను శరణము వేడుచున్నాను. ప్రియ మిత్రులారా! ఈ కార్తిక మాసమునకు మనము చేయు బిల్వార్చనమునందు "మీఢుష్టమ" అనే పదమును అర్థము చేసుకు...