IDEYAM TVAAM PASYAAMI/KADAA TVAAM PASYAEYAM-29

ఇదేయం త్వా పశ్యామి-03 కదా త్వాం పశ్యేయం-29 ********************** "జిహ్వ చిత్తశిరోంఘ్రి నయన శ్రోతైః అహం ప్రార్థితం నమామి భగవత్పాదం శంకరంలోక శంకరం." " హరం త్రిపురభంజనం అనంతకృత కంకణం అఖండదయం అంతరహితం విరించి సుర సంహతి పురందర విచించిత పదం తరుణచంద్ర మకుటం పరం పద విఖండిత యమం భసిత మండిత తనుం మదన వంచన పరం చిరంతనమముం ప్రణవ సంచితనిధిం పర చిదంబర నటం హృది భజ." అని పతంజలి చే స్తుతింపబడిన త్రిపురహరుని మనములో త్రికరణ శుద్ధితో నిలుపుకుని, ఈనాటి బిల్వార్చనమును ప్రారంభించుకుందాము. పిల్లలు శంకరయ్య చుట్టుముట్టి,కనకసభకు చేరుకునేలోగా మ0చికథను చెప్పమని అడిగారు. ఎవరికథ ఎందుకు? నా కథ చెబుతాను అన్నాడు వారితో.మీకథ చెబుతారా-బాగుంటుందా అని అడిగారు పిల్లలు. విన్న తరువాత మీరే చెప్పాలి ఎలావుందో? ఒకానకొప్పడు శంకరయ్య శివునిమీద చాలా కోపముతో ఉండేవాడు.మోసగాడు అనుకునేవాడు.మనసు-వాక్కు-పని శివునికినమస్కరించమంటే మొరాయించేది. ఎందుకు?అమాయకముగా అడిగారు పిల్లలు. ఎ...