SARVARTHASADHAKACHAKRAMU

"తాదృశం ఖడ్గమాప్నోతి యేనహస్త షితేనవై అష్టాదశ మహాద్వీప సమ్రాడ్భోక్తా భవిష్యతి" ప్రాణసక్తికి నిలయమయిన వాయువ్యవస్థను వివరించు ఈ చక్రమును గురించి పరమేశ్వరుడు మాత పార్వతీదేవితో, " శక్తిః ఏకాదశస్థానే స్థిత్వా సూతై జగత్రయం విశ్వయోనిః ఇతిగ్యాతా సా విష్ణు దశరూపకం." పరబ్రహ్మము తాను నిశ్చలముగానుండి తననుండి పది అద్భుతశక్తులను స్థితికార్య నిర్వహణకై ఉత్పత్తి చేసినది.వైష్ణవీ శక్తి శ్రీ లలితా రహస్య సహస్ర నామములోచెప్పినట్లు, "కరాంగుళి నఖోత్పన్నా నారాయణదశాకృతి" ని ప్రకటింపచేసినది. ఈ ఆవరణములోనికి ప్రవేశించిన సాధకుడు తాను ఐదు ప్రధాన వాయువులు-ఐదు ఉపవాయువుల మధ్యన ఉన్నానని గ్రహించగలుగుతున్నాడు. తనతోపాటుగా తన వెంట వశిత్వ సిద్ధిమాత-సర్వోన్మాదిని ముద్రాశక్తి మాత కనిపెట్టుకుని ఉన్నారన్న విషయమును గ్రహించగలుగుతున్నాడు. సర్వసిద్ధిప్రదాదేవి సర్వసంపత్ప్రదాదేవి సర్వప్రియంకరీదేవి సర్వమంగళకారిణీదేవి సర్వకామప్రదాదేవి సర్వ దుఃఖవిమోచనీ దే...