KADAA TVAAM PASYAEYAM-- 26

కదా త్వాం పశ్యేయం-26 ***************** "జిహ్వ చిత్తశిరోంఘ్రి నయన శ్రోతైః అహంప్రార్థితం నమామి భగవత్ పాదం శంకరం లోకశంకరం." "ఆనందామృత పూరితా హరపదాంభోజ వాలోద్యతా స్థైర్యోపఘ్నముపేత్య భక్తి లతికాశాఖోపశాఖాన్వితా ఉచ్చైర్మానసకాయమాన పటలీ మాక్రమ్య నిష్కల్మషా నిత్యాభీష్ట ఫలప్రదా భవతు మే సత్కర్మ సంవర్ధితా." పరమేశ్వర పాదపద్మములనే పాదునకు విస్తరిస్తున్న మనసును పందిరిగా చేసి,భక్తి యను తీగెను,అమృతజలములతో తడుపుతూ,దుష్కర్మలను కలుపులను తీసివేస్తున్న సమయమున 'నిత్యాభీష్టములను" ఫలములను అందించుటకు సిద్ధముగానున్న శంకరానుగ్రహమను వృక్షరాజమునకు నమస్కరిస్తూ,ఈనాటి బిల్వార్చనమును ప్రారంభిద్దాము. ' మా రేడు నీవని నీ పూజచేయ మారేడు దళములు నీసేవకు గంగమ్మ మెచ్చిన జంగమయ్యవని గంగను తేనా నీసేవకు" శివ శివ శంకర-భక్తవశంకర శంభో హర హర నమోనమో". సమీపిస్తున్న శంకరయ్య సందేహమునకు సమాధానముగా మీరు ఇప్పటివరకు చూచినవి-వినినవి-తెలుసుకొనునవి ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుని,ఆలోచిస్తే సర్వము అ...