AALO REMBAAVAAY-22

పాశురము-22 *********** " అహమును వీడి రాజసము సర్వవాహనమగు సుందరరూపము ఇహపరమని కాంచగనీయదు సహనము లేనిదగు మాదుశాపము" సరస సింగారభరితముగా భ్రమింపచేసిన సంసారమను, తమోభూమిని వీడి తపోభూమిని ప్రవేశించినారు గోపికలు.కాని వారికి స్వామి దర్శనము లభించకపోవుటకు కారణము ఇంకను తమను వెంటాడుతున్న ,తమను పూర్తిగా విడువని శాపములేమో.స్వామి తన దృక్కులద్వారా వాటిని పరిహరించగలడను నమ్మకముతో, "అకించిన్యం"-నా ఉపాధి సమర్థవంతము కానిది "అనన్యగతిత్వం'-అది కదులుచున్నదంటే అది నీ అనుగ్రహమే అను భావనను "సర్వవాహన" సింహాసన !అను అందమైన ఉదాహరణలతో గోపికల పలుకుల ద్వారా అందించుచున్న గోదమ్మకు అనేకానేక దాసోహములను సమర్పించుకుంటు,పాశురమును అనుసంధానము చేసుకునే ప్రయత్నమును చేద్దాము. ఇరువది రెండవ పాశురము. ********************* అంగణ్ మాఞాలాత్తరశర్ అబిమాన బంగమాయ్ వందునిన్ పళ్ళికట్టిల్ కీళే శంగం ఇరుప్పార్ పోల్వందు తలైపెయిదోం కింగిణి వాయ్ శెయిద తామరై పూప్పోలే శెంగణ్ శిరిచ్చిఱిదే యెమ్మేల్ విళియావో తింగళుం ఆదిత్తనియుం ఎళుందార్ పోల...