Posts

Showing posts from November 7, 2021

TIRU MOOLAR NAAYANAAR

తిరుమూలర్ నాయనారు ******************* మూలర్ అను సత్తనూరు గ్రామవాసియైన విగతజీవుడైన పశువుల కాపరిశరీరములోనికి ప్రవేశించిన వాడు కనుక ,నాయనారు అసలుపరు మరుగున పడి,తిరుమూలర్ నాయనారుగా ప్రసిధ్ధి చెందినాడు. తిరునంది దేవారు ఎనిమిది మంది శిష్యులలో ఒకరు తిరుమూల నాయనారు.మూలాన్ శరీరములోనికి పరకాయ ప్రవేశము చేసినందుకు తిరుమూలారు అయినాడు.తిరుమూలారు అగస్త్యముని సందర్శనార్థము దక్షిణ దిశగా బయలుదేరాడు.కావేరీనదీ స్నానమును చేసి దైవదర్శనమునకు వెళ్ళుచుండగా,కాపరిని కోల్పోయి ఒక ఆవులమంద విచారముగా కన్నీరు కారుస్తూ కనిపించింది. గౌవాగ్ని అనునది శ్రుత వాక్యము. అగ్నితో సమానమైన గోమాత ఎలా ప్రభవించింది?ఒక సారి బ్రహ్మదేవుడు ద్వాదశాదిత్యులను, ఏకాదశ రుద్రులను,అష్ట వసువులను పిలిచి ఒకసంవత్సరము పాటు తీవ్ర తపస్సును చేసిన, తత్ఫలితముగా ఒక అద్భుత ప్రాణి సృష్టింపబడును గాక.ముప్పదిమూడు కోట్ల దేవతల యొక్క పవిత్రత దానియందు నిక్షిప్తము అగుగాక అని దీవించిరి.వారి అచంచల తపోవైభవ విశేషమే గోమాత జననము.నిష్ఠా గరిష్టతతో అగ్నికార్యమునుచేయలేని వారికి,సులభముగా సుసంపన్నులగుటకు గోసేవా భాగ్యము కల్పించబడినదన్న విషయమును తెలిసిన ,.నాయనారు ఆవుల...

ADIPATTA NAYANARU

అడిపత్త నాయనార్ **************** నాగపట్టణమునకు పరదవర్ అనగా బెస్తజాతినాయకుడు -పరమ శివభక్తుడు అడిపత్త నాయనార్.పరాశర మహర్షిచే అనుగ్రహింపబడిన వ్యాసుని తల్లియైన మత్స్యగంధి వంశమువాడు. ప్రతిరోజు చేపలు పట్టి,వానిని అమ్మి వచ్చిన ధనముతో జీవనమును సాగించుట కులవృత్తి.పట్టిన చేపలలో మొదటిదానిని(చిన్నదైన-పెద్దదైన)శివనైవేద్యముగా కడలికి తిరిగి సమర్పించుట ప్రవృత్తి. కాలాంతకుని లీలలు కాలమును ఒక్కరీతిగా గడువనీయదు కదా.కరుణ తాను కాసేపు కనుమరుగై కఠినత్వమునకు దారిచూపుతు తన పని కానిచ్చేస్తుంటుంది. మన నాయనారును క్రమక్రమముగా పరీక్షించసాగినది. పక్కనున్న బెస్తల వలలో పుష్కలముగా చేపలు.అడిపత్త వలలో మాత్రమే ఒకే ఒక చేపను చిక్కించి కాలము తన మాయా జాలము చేస్తున్నది.అడిపత్త అత్యంత భక్తిశ్రధ్ధలతో దానిని శివనైవేద్యముగా సమర్పించి,సంతుష్టాంతరంగుడై పస్తులను ఉంటూ ఏమాత్రము నొచ్చుకోకుండా వచ్చి (ప్రతిరోజు) వలవేసి,వచ్చిన దానిని స్వామికి నివేదనము చేసి వెళ్ళేవాడు. సరిలేనివాని కరుణకు సాక్ష్యముగా కఠినరూపముగా నాయనారు దరిచేరిన దారిద్ర్యము శివనైవేద్య నియమమును దూరముచేయలేకపోయినది.చింతను దగ్గరకు రానీయలే...