Posts

Showing posts from April 20, 2023

ANIRVACHANEEYAM-ADITYAHRDAYAM-NITYAM YAKSHA SEVITAM

Image
   ఋషులు-గంధర్వులు-నాగులు-అపసరసలు-యక్షులు-రాక్షసులు-దేవతలు అను సప్తగణములతో స్వామి సేవింపబడుతున్నాడు.యక్షుల గురించి తెలుసుకునే ప్రయత్నమును చేద్దాము.  వీరిని ఉపదేవతలు అని కూడా అంటారు.దివ్యశరీరులు.దయార్ద్రహృదయులు.  వీరు ఒక్కొక్క మాసములో ఒక్కొక్కరు సుర్య రథ గమనమునకు ముందు అశ్వములను అనుసంధానము చేస్తారని ఐతిహాసికము చెబుతున్నది.  వైజ్ఞానిక పరముగా ఆలోచిస్తే వీరు భూగర్భ సంపదలను-వృక్షమూల సంపదలను పరిరక్షించుతకు అనుకూలముగా సూర్యకిరణ సముదాయమును నిర్దేశిస్తారట.  యక్షుల తెగకు అధిపతిగా కుబేరుని ప్రస్తుతిస్తారు.   సనాతనము సూర్యభగవానుని  1.జన్మదాత  2.అన్నదాత  3.స్థితిదాత  4.జ్ఞానదాత  5.భయత్రాత గా కీర్తిస్తుంది.దీనికి ఉదాహరణముగా,  పరమాత్మ,  1.మధుమాసములో-రథకృత్ అను యక్షుడు  2.మాధవ మాసములో-అతౌజుడు అను యక్షుడు  3.శుక్ర మాసములో-రథస్వనుడు అను యక్షుడు  4.శుచి మాసములో-చిత్రస్వనుడు అను యక్షుడు  5.నభః మాసములో-శ్రోతస్వామి అను యక్షుడు  6.నభస్య మాసములో-అశరణుడు అను యక్షుడు  7.ఇష మాసములో-శతాజిత్ అను యక్షుడు  8.ఊర్జ్...

ANIRVACHANEEYAM-ADITYAHRDAYAM-NITYA GAMDHARVA SEVITAM.

Image
   చాంద్రమాన ప్రకారము చైత్రము నుండి ఫాల్గుణము వరకు ప్రస్తావింపబడిన పన్నెండు తెలుగు నెలలు,సౌరమాన ప్రకారముగా,  1.మధుమాసము,  2.మాధవ మాసము, 3.శుక్ర మాసము,  4.శుచి మాసము,  5.నభస్ మాసము,  6.నభస్య మాసము,  7.ఈశ మాసము,  8.ఊర్జ్య మాసము,  9.సహస్ మాసము, 10.సహస్య మాసము, 11.తపస్ మాసము 12.తపస్య మాసముగా  కీర్తింపబడుతున్నవి.  గానధరులు కావున వీరిని గంధర్వులు అని పిలుస్తారు.వీరు సౌందర్యమతులు.సౌగంధభరితులు.చాలా వరకు వీరి శరీరములో సగభాగము మానవాకృతి-మిగిలిన సగము గుర్రమో-పక్షియో-జంతువో కలగలిసియుంటుందట.వీరి సంఖ్యను 6333 కంటె ఎక్కువగా ఉంటారని చెబుతారు.వీరు సూర్యభగవానునికి అతి సమీపములో గానము చేస్తూ రథగమనమునకు సహాయపడుతుంటారు.ఇది ఐతుహాసికము.వైజ్ఞానిక పరముగా ఆలోచిస్తే వీరు కిరణములతో పాటుగా తామును కిందికి దిగుతూ,భూమికి పోషకత్వమునకు హాని కలిగించు కణములను నిర్మూలిస్తూ ఓజోను పొరను దృఢపరుస్తారట.  వాతావరణమునకు అనుకూలమగు నాదమును సృజిస్తూ ఒక్కొక్క నెల ఒక్కొక్క గంధర్వుడు సూర్యనారాయణుని సేవిస్తాడని సూర్యపురాణము చెబుతున్నది.  సనాతన సంప్రదాయ ప్రకారము  ...

ANIVERCHANEEYAM-ADITYAHRDAYAM-VAALAKHILYA PRASTUTAM ANIsAM.

Image
  మండలాంతర్గత పరమాత్మ రధగమనమునకు శుభారంభముగా వాలిఖ్యాది మహా మునులు వేదపఠనమును చేస్తుంటారట.  అసలు సూర్యునికి వీరికి కల అవినాబావ సంబంధమేమిటి? అన్న సందేహము కలుగవచ్చును.   సనాతన సంప్రదాయ ప్రకారము వీరు అంగుష్టమాత్ర పరిమాణములో కనిపించు మహా తపసంపన్నులని నిర్ధారించినప్పటికిని వారి ఆవిర్భావ కథనములు అనేకానేకములుగా చెప్పుకుంటారు.  వీరు అసంఖ్యాకులనియు,60,000 మించి యున్నారనియు నమ్ముతారు.  ప్రకృతి అవిచ్ఛిన స్వరూపమే వాలిఖ్యాదిములని (వాలహిల్యమని)కొందరు,ఋగ్వేద మంత్రములను  వాలిఖ్యములంటారని కొందరు భావిస్తారు.ప్రజా పతి రేతశ్సు సీఘ్ర స్కలనము నొంది అనేకానేక మహాసక్తులని సృష్టించిందని నమ్ముతారు.  శివ పురాణ కథనము ప్రకారము శివ-పార్వతుల కళ్యాన మహోత్సవ సమయమున పార్వతిని చూసిన బ్రహ్మకు మనసు చెదిరి జారిపడిన వీర్యమును కాలితో కప్పచూడగా పరమేశ్వరుడు దానిని అగ్నికి హవిస్సుగా సమర్పించమనెనట.అప్పుడు అగ్నిలో నుండి సూర్యతేజముతో-తపోనిధులైన అంగుష్టమాత్ర పరిమాణముతో అనేకానేక దివ్య పురుషులు ఆవిర్భవించారట.వారు అనునిత్యము సూర్యోదయము నుండి-సూర్యాస్తమయము వరకు స్వామిని ప్రస్తుతిస్తూనే ఉంటారట.సూర్య రథగమ...