CHAMAKAMUTO MAMAEKAMU-03

చమకములొ శబ్దము పరమాత్మ తాను స్పూర్తియై మనచేత వాగ్రూపముగా అభ్యర్థలను జరిపించి,అనుగ్రహించుట ఎందుకు? తానే నేరుగా అనుగ్రహించ వచ్చును కదా! అను సందేహము కలుగ వచ్చును. కాని ప్రకృతి నియమానుసారముగా మనకు ఆకలి వేసిన మనమే ఆహారము దగ్గరికి వెళ్ళవలెను.నది నిరంతరము మన దప్పిక తీర్చుటకు తనదైన తీరులో ప్రవహిస్తూనే ఉంటుంది కాని మన దగ్గరకు రాదు.దప్పిక తీర్చుకొనుటకు మనమే జలము దగ్గరకు వెళ్ళలి.అదే విధముగా భగవత్ ప్రాభవమును మనకు పరమాత్మ తెలియపరుస్తూనే ఉంటాడు.మనము గుర్తించగలగాలి.అడగాలి.ఆసరా చేసుకోవాలి.అవరోధములను అధిగమించి,ఆయన పద సన్నిధిని చేవ్రుకోగలగాలి. మనలోని శక్తిని బహిర్గతము చేయాలంటే శబ్దము చాలా అవసరము.అందుకే కాంతిని-శబ్దమును (ప్రణవమును) పరమాత్మ మనకు అందించాడు.ఆ ప్రణవము జీవులను చైతన్య పరచి,వాగ్రూపముగా బహిర్గతమై వాంఛాఫలితములకు సహాయపడుతుంది. ఆకాశము శబ్ద వాచకము.ప్రథమ భూతము.మహర్షులు దివ్య శబ్దములను అనంతాకాశములో తమ తపశ్శక్తితో వినగలుగుచున్నారు.శబ్దము కలుగచేయు జ్ఞానము మన తమస్సును పోగొట్టును.జగతి మానవులు సృజించలేని దృశ్య వైభవమైతే వేదములు-ప్రణవము మానవులు సృజించలేని శబ్ద వైభవములు. కనుక ప్రథమ...