AALO REMBAAVAAY-07
.jpg)
పాశురము-07 ********** గోదమ్మకు అనేకానేక దాసోహములను సమర్పించుకుంటు.అనుగ్రహించినంత మేరకు అనుసంధానమును చేసుకుందాము. కీశు కీశెన్రెంగుం ఆనైచ్చాత్తు కలందు పేశిన పేచ్చరవం కేట్టిలైయో? పేయ్ పెణ్ణే కాశుం పిరప్పుం కలగల ప్పక్కై ప్పేర్తు వాశ నరుం కుళల్ ఆయిచ్చియర్ మత్తినాల్ ఓశై పడుత్త తైరరవం కేట్టిలైయో? నాయగ పెణ్ పిళ్ళాయ్ నారాయణన్ మూర్తి కేశవనై పాడవుం నీకేట్టే కిడత్తియో దేశం ఉడయేయాయ్ తిరనేలో రెంబావోయ్. నారాయామంత్రం-శ్రీమన్నారాయణ భజనం. ****************************** ఓ కర్ణేంద్రియమా జాగృతము అయ్యి శ్రవణభక్తిని ఆచరించి ఆస్వాదించు పరమాత్మ ప్రసన్నతను అంటూ ఆరవ పాశురములో చెప్పినట్టుగానే, కేట్టిలియో?-వినలేదా అని లోపలనున్న గోపికను ప్రశ్నించుచున్నది. ప్రస్తుత పాశురములో నాసికను సైతము జాగృతముకమ్మని ఆయిచ్చ్నర్ వాసనరుం కుళల్ గొల్లపడుచుల సుగంధకేశపాశముల పరిమళములను ఆస్వాదించుము అని మరొక ఇంద్రియ ప్రస్తావన తెచ్చినది. నారాయణమూర్తి కేసవనై-పాదవుం అంటూ వాక్కును సైతము హెచ్చరించినది. నిదురించుచున్న వార...