ANIRVACHANEEYAM-ADITYAHRADAYAM(RGYAJUSAMAPARAGA)
.jpg)
అగస్త్యమహాముని ఆదిత్యహృదయ స్తోత్రము ద్వారా సూర్యభగవానుని వేదమూర్తిగా ప్రస్తుతిస్తున్నాడు. పరము-పారము అనగా -ఒడ్డు లేక తీరము. సూర్యనారాయణమూర్తి ఋఇగ్-యజ్-సామ వేదములను సాధనములద్వార పరమును అందించువాడు అని చెప్పబడుతున్నది. అసలు వేదములు అంటే ఏమిటి? అనే ప్రశ్నను సమాధానమును పొందాలంటే " విద్" అను ధాతువు నుండి పుట్టినది వేదము.అనగా తెలియచేయునది/తెలుసుకొనుటకు ఆధారమైనది.పరబ్రహ్మమును తెలుసుకొనుటకు జీవునికి ఆధారమైనది వేదము.దీనినే ఋతము అనగా మార్పులు చెందనిది అని కూడా చెబుతారు. పరమాత్మ నాదముగా ఋషులకు వినబడినది కావున శృతము అని కూడా అంటారు. పరమాత్మ అనుగ్రహరూపము కనుక అపౌరుషేయములు అని కూడా పిలుస్తారు. "అనంతావై వేదాః" అన్నది ఆర్యోక్తి. పరమాత్మ నిశ్వాసములుగా భావించబడే/భాసిస్తున్న వేదములు మొదట మూడుగాను-కాలక్రమమున నాలుగు గాను ప్రసిద్ధిచెందినాయి.అవే, 1.ఋఇగ్వేదము-దీనిలోని ఛందోబద్ధ స్తోత్రములను ఋక్కులు అని వ్యవహరిస్తారు.కొమదరు ధన్యాత్ములు శబ్దముతో పాటుగా ఆవిర్భవించిన రూపమును (సంకేతములను)సైతము దర్శించి వేదపురుషునిగా ప్రస్తుతించారంటోంది సనాతనము. 2.యజుర్వేదము- ...