NA RUDRO RUDRAMARCHAYAET-16 (SIVAANAMDALAHARI)

విరించి దీర్ఘాయుః భవతు భవతాం తత్పర శిరః చతుష్కం సంరక్షం స ఖలు భువి దైన్యం లిఖితవాన్ విచారః కోవా మం విశద కృపయా పాతి శివతే కటాక్ష వ్యాపారః స్వయ మపిచ దీనావన పరః విధిలిపిం కిం న హరసి అని వేదనలో స్వామి అశక్తుదనో.ఉపేక్షచేయుచున్నాడనిన శంకరులు,భక్తునకు దిశానిర్దేశము చేస్తూ,కఠినముగా కనిపిస్తున్న పరిస్థితులే కారుణ్యప్రదములుగా ఏ విధముగా స్వామిచే స్పురింపచేయగలవో ప్రస్తుత శ్లోకములో వివరిస్తున్నారు. మనసు అతిచంచలము.అప్పుడప్పుడు కాచేవారినే నిందిస్తుంది తరువాత నిజమును గ్రహిస్తుంది. హే విభో-జగద్రక్షకా తే కటాక్షవ్యాపార-నీకృపాకటాక్ష ప్రసరణముచే మాం-నన్ను పాతుం-రక్షించుము. నేను పాహి పాహి అని ప్రర్థిస్తాను.నీవు పాతుం పాతుం అంటు రక్షిస్తాఉ. శివా,నన్నే కాదు,నా నుదుటను దీనావస్థను లిఖించిన ఆ బ్రహ్మను సైతము రక్షించుము.కినికి తలలను తీసివేయకుము. శిరః చతుష్టం సమ్రక్యం-నాలుగు తలలను వాటి పనులను చేసుకోనిమ్ము. నేను ఆయన వ్రాతను నిందించానని ఆయనపై ఆగ్రహించకుము. బహిశా స్వార్థము తనరూపును మార్చుకుని పరమార్థమును చేరే ప్రయత్నమేమో. దీ...