Posts

Showing posts from November 15, 2022

NA RUDRO RUDRAMARCHAYAET-24

Image
     న రుద్రో రుద్రమర్చయేత్-24    ************************     జటాజూటధారి-శివాచంద్రమౌళి    నిటాలాక్ష నీవే-సదా మాకు రక్ష.    ప్రియమిత్రులారా ఈనాటి బిల్వార్చనలో మనము జట శబ్దమును అర్థముచేసుకునే ప్రయత్నమును చేద్దాము.   శిష్తరక్షన-దుష్టశిక్షణ చేయగల స్వామి ప్రకటన శక్తి జట.   భగీరథుని అనుగ్రహించినది స్వామి. జటాజూట సహకారమేకదా .శాపగ్రస్తుదైన చంద్రుని శిరోలంకారముగా మలచినది స్వామి జటాజూటమే.స్థితికార్య సంకేతము స్వామి జటాజూటమే.జీవుల శరీర నాడుల ముడులు స్వామి జటాజూటములే.  దక్షయజ్ఞ సందర్భముగా ఆ జటనుండి ఉద్భవించిన వీరభద్రుడు దక్షుని అహమును నశింపచేసినాడు కదా.   స్వామి ఆకాసతత్త్వమును చెప్పునది స్వామి ఊర్థ్వ కేశపాసమే కదా.   ఎన్నో పుణ్నదులను ప్రవహింపచేస్తున్నది స్వామి జటయే.   నమకములో జట శబ్దమును,  2.వ అనువాకము 5వ మంత్రము  " నమో హరికేశాయ ఉపవీతినే " స్వామిని హరికేశునిగా వర్ణించినది.    నల్లని కేశములుగా కనుక అన్వయించుకుంటే   నమః శివాభ్యాం-నవ యవ్వనాభ్యాం"   ఆకుపచ్చని కేశములుగా అన్వయించుకు...

NA RUDRO RUDRAMARCHAYAET-22

Image
   న రుద్రో రుద్రమర్చయేత్-23  *********************** " స్వస్తి ప్రజాభ్య: పరి-పాలయంతాం  న్యాయేన మార్గేణ మహీం మహీశ:  గో-బ్రాహ్మణేభ్య: శుభమస్తు నిత్యం  లోకా: సమస్తాత్ సుఖినో భవంతు."             శాంతిమంత్రం.  విశ్వపరిపాలనలో గోవులను-బ్రాహ్మణులను సంరక్షించుటచే సమస్తలోకములు సుఖముగా నుండునుగాక.  ఇది" విశ్వశ్రేయో మంత్రము"   .ఇందులో వచ్చిన గో-బ్రాహ్మణ శబ్దములు అత్యంత  ముఖ్యమైనవి.సంస్కారవంతమైనవి.గో శబ్దము సకల దేవతా స్వరూపము.దేవతలనగా ఇంద్రియములు అనే అర్థమును కూడా చెబుతారు.అదేవిధముగా పంచభూతములను కూడా అన్వయిస్తారు.సమస్త వాక్కులను కూడా గో శబ్దముగా భావిస్తారు.అంటే ఒక విధముగా విశ్వమును గో శబ్దముతో సంకేతిస్తూ,దానిలో దాగిన,దానిలోనే కాదు,తనలో దాగియున్న ఈశ్వరచైతన్యమును-తాను చూస్తున్న చైతన్యమును బిబ-ప్రతిబింబములుగా. గ్రహించగలిగిన వాడు బ్రాహ్మణుడు.తనలోపల/తన చుట్టు ఉన్న ఈశ్వరచైతన్యమును గుర్తించి,గౌరవించుటయే బ్రహ్మజ్ఞానమని పెద్దలు చెబుతారు.  అహం బ్రహ్మాస్మి-నేను బ్రహ్మము కంటే వేరుకాదు అను తత్త్వమును అర్థముచేసుకొని ఆరాధించువేళ ...