TIRUPPAVAI-13
.jpg)
తిరుప్పావై-పాశురం 13 ****************** మాతః సముత్థితవతీ మదివిష్ణుచిత్తం విశ్వోప జీవ్యమమృతం మనసా దుహానాం తాపఛ్చదం హిమరుచేరివ మూర్తిమన్యాం సంతః పయోధి దుహితః సహజాంవిదుస్త్వాం." పూర్వపాశుర ప్రస్తావనము. ********************** తంగచ్చన్ చెల్వై /ఐశ్వర్య వంతమైన గోపికను ,స్వామి సేవనమునకై సమస్త సంపదలను లెక్కచేయని ఆమె అన్నను,ఆచార్యుల అవ్యాజానుగ్రహమును ,లంకాద్వీప పాలకుని తమో-రజోగుణములను తెలిపిన గోదమ్మ, ప్రస్తుత పాశుర ప్రాభవము **************** ప్రస్తుత పాశురములో మానవ సహజమైన పోటీ ని గోపికలు రామావాతార-శృఈకృష్ణావతార విషయములలో వాదించుకొనుట అను కొత్త ఒరవడిని పరిచయము చేసినది. అది జ్ఞానముకాదు/అజ్ఞానము కాదు.మిథ్యాజ్ఞానము. పరమాత్మ అవతారముల పరమార్థమును అర్థముచేసుకొనలేకపోవటము. దానిని మరొక అనుభవ్చజ్ఞురాలైన మరొక గోపికచే సూక్ష్మమును/సమస్యాపరిష్కారమును సూచించినది. మొదటి పాశురములో చెప్పిన నన్నానాళ్-పుణ్య సమయము అని,పుళ్ళుం శిలంబిన-ఆచార్యులు అనుగ్రహించుతకు సిద్ధముగానున్నారని, కుళ్ళక్-కుళరళ్-కుడైందే-నీరాడ...