SIVATANDAVA STOTRAMU(SIVETI MAMTRAMUCHCHAREN KADA-WHEN)-13
.jpg)
కదా నిలింపనిర్ఝరీనికుంజకోటరే వసన్ విముక్తదుర్మతిః సదా శిరఃస్థమంజలిం వహన్ | విముక్తలోలలోచనో లలాటఫాలలగ్నకః శివేతి మంత్రముచ్చరన్ సదా సుఖీ భవామ్యహమ్ || 13 || క్రిందటి శ్లోకములో సాధకునకు కావలిసిన మనోస్థితిని సమస్థితిగా వివరిస్తూ,అట్తి స్థితిని పొందుటకు బాహ్యవస్తువులలోని వైవిధ్యమును గమనిస్తూ ద్వంద్వములో దాగియున్న మూలమును గ్రహింకలిగే సంస్కారమును పొందాలి అని చెప్పబడినది. ప్రస్తుత శ్లోకములో ఆసనమును గురించి ఎటువంటి ప్రదేశము అనువైనది నాలుగు విధములుగా ఐదవది ఫలితముగా చెప్పబడినది.అవియే 1.వసనము 2.స్మరనము 3.లగ్నము 4.వందనము 5.సుఖము 1.వసనము. ******* బాహ్యమునకు నిలింపనిర్ఝరీ ప్రవాహ తటమున కల కుటీరము అనువైనదట.భ్రూమధ్యక్షే త్రమైన కాశీక్షే త్రమున ప్రవహించుచున్న గంగానదీ తీరమున నున్న పవిత్ర ఆశ్రమములో అధిష్ఠించి ఉపాసనను ప్రారంభించవేల్ననెను. మనసులో కదిలే ఆలోచనలన్నీ నిలింపనిర్ఝరీ తరంగములు కావలెని.వాటి తీరమున నున్న హృదయ కుహరము కుటీరముగా కావించుకొనవలెను. ...